Miryalaguda : ఘనంగా అంబేద్కర్ జయంతి..!
Miryalaguda : ఘనంగా అంబేద్కర్ జయంతి..!
మిర్యాలగూడ, మన సాక్షి :
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ 135 వ జయంతిని ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుండి కాంగ్రెస్ కార్యకర్తలు, అంబేద్కర్ అభిమానులు అందరూ కొమ్ముశ్రీనివాస్ ఆధ్వర్యంలో ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా పూలమాలలతో సత్కరించినారు. ఈ కార్యక్రమంలో స్థానిక మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి పొదిలశ్రీనివాస్, చిలుకూరు బాలు, స్కైలాబ్ నాయక్, శాగ జలంధర్ రెడ్డి కాంగ్రెస్ మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు.
హాస్పిటల్ లో :
పట్టణంలో కొమ్ము శ్రీనివాస్ అణగారిన వర్గాల ఐక్యవేదిక రాష్ట్ర నాయకులు, మాజీ కౌన్సిలర్ ఆధ్వర్యంలో స్థానిక గవర్నమెంట్ హాస్పటల్ యందు పండ్లు, బ్రెడ్ ను రోగులకు పంపిణీ కార్యక్రమం చేపట్టనైనది. ఇట్టి కార్యక్రమంలో స్థానిక మిర్యాలగూడ దళిత సంఘ నాయకులు పాల్గొన్నారు.
34 వార్డు కాంగ్రెస్ ఇన్చార్జి ఉబ్బ పెళ్లికాశయ్య, దైద కాశయ్య , గూడపురి శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సైదులు, బీసీ సంఘం రాష్ట్ర నాయకులు పోలగాని వెంకటేష్ గౌడ్, చిన్నపంగా శ్రవణ్, ఆర్కే, దైద శ్రీను, శివమణి, మురళి, సతీష్ గౌడ్, దైద రవికుమార్, మంద శ్రీనివాస్, శోభన్, తదితరులు పాల్గొన్నారు.
MOST READ :










