Nalgonda : చిట్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు బస్సుల మద్య నలిగిన కారు..!

Nalgonda : చిట్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు బస్సుల మద్య నలిగిన కారు..!
చిట్యాల, మన సాక్షి :
నల్గొండ జిల్లా చిట్యాల ఆదివారం తెల్లవారుజామున సుమారు 05:20 గంటల సమయంలో హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆరంజ్ ట్రావెల్స్ బస్సు (ఎన్ ఎల్ 01 బి 3210 ) .
ట్రాఫిక్ కావడంతో చిట్యాల లోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ సమీపంలో ఆగి ఉండగా బస్సు వెనకాల వచ్చిన కారు ఏపీ 39 ఎం ఎచ్ 5699 గల కారు బస్సు వెనకాల ఆపగా అదే సమయంలో హైదరాబాద్ వైపు వెళ్తున్న కె.వి.ఆర్ ట్రావెల్స్ బస్సు (ఎన్ ఎల్ 01 బి 2457) డ్రైవర్ జోవన్న పూడి విజయ్ కుమార్ తన బస్సును అతి వేగంగా అజాగ్రత్తగా నడుపుకుంటూ కారును వెనకాల నుండి బలంగా ఢీకొట్టింది.
కారులో ప్రయారిస్తున్న గొర్రె జోష్ కుమార్, చర్ల శ్రీహర్ష మచిలీపట్నం వాసులకు బలమైన గాయాలు తగిలాయి. ఇట్టి విషయంలో పైల మురళి తండ్రి పాండురంగారావు పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు అక్కడకు చేరుకొని గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై మామిడి రవికుమార్ తెలిపారు.
MOST READ :
-
District collector : జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం.. ప్రజావాణి కార్యక్రమం రద్దు..!
-
MPDO : సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్ పై అవగాహన..!
-
Special Story : శాఖాహారుల ప్రోటీన్ వంటకం.. రుచులను ఆస్వాదించండి.. ప్రత్యేక కథనం..!
-
Roti : రాత్రి మిగిలిన రోటీ పారేస్తున్నారా.. ఇలా చేస్తే అద్భుతం.. ఆరోగ్య లాభాలు తెలుసుకోండి..!









