SBI : ఎస్బిఐ కీలక ప్రకటన.. ఇక నిమిషాల్లోనే లోన్..!

SBI : ఎస్బిఐ కీలక ప్రకటన.. ఇక నిమిషాల్లోనే లోన్..!
మన సాక్షి, వెబ్ డెస్క్:
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SVI) 2023 – 24 లో ప్రారంభించిన ఎస్ ఎం ఈ డిజిటల్ బిజినెస్ రుణాలకు గణనీయంగా స్పందన లభిస్తుందని పేర్కొన్నది. చిన్న, మధ్య తరహా సంస్థలకు రూ.5 కోట్ల వరకు రుణాలను అందజేస్తుంది. రుణాల మంజూరు కి టర్మ్ రౌండ్ సమయం కేవలం 45 నిమిషాలకు తగ్గిందని పేర్కొన్నది.
అయితే వచ్చే ఐదు సంవత్సరాల పాటు కొద్ది లాభదాయకమైన కోసం MSME రుణాలపై మరింతగా దృష్టి పెట్టాలని ఎస్బిఐ నిర్ణయించింది. ఎం ఎస్ ఎం ఈ కి సంబంధించిన ముద్ర రుణాలు కూడా ఇందులో భాగంగానే ఉన్నాయి.
అయితే అవసరమైన వివరాలన్నీ సమర్పించిన తర్వాత కేవలం 10 సెకండ్ల వ్యవధిలోనే రుణాలు మంజూరు చేయాలని నిర్ణయం తీసుకుంది. డేటా ఆధారిత క్రెడిట్ అసెస్మెంట్ ఇంజన్ రూపొందించినట్లు బ్యాంకు పేర్కొన్నది. సుమారు 50 లక్షల రూపాయల వరకు రుణాల మదింపు కోసం లావాదేవీల చరిత్ర, జిఎస్టి, రిటర్న్ లను పరిగణలోకి తీసుకొని.. ఆర్థిక పత్రాలు సమర్పించాల్సిన నిబంధనను మినహాయిస్తున్నట్లు బ్యాంకు పేర్కొన్నది.
MOST READ NEWS :
-
Alumni : 33 ఏళ్ల తర్వాత ఆత్మీయ కలయిక.. గత జ్ఞాపకాలతో పూర్వ విద్యార్థులు..!
-
District collector : విధుల పట్ల నిర్లక్ష్యం.. జిల్లా కలెక్టర్ సీరియస్, ప్రిన్సిపాల్ కు షోకాజ్..!
-
Nalgonda : మైనర్ బాలికపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడు అరెస్ట్..!
-
Miryalaguda : ఎమ్మెల్యే హెచ్చరిక.. మద్దతు ధర కంటే తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేస్తే చర్యలు..!
-
Bike Driving : బైక్ నడిపేవారికి గుడ్ న్యూస్.. వెన్నునొప్పి తగ్గించే రహస్యాలు..!









