TOP STORIESBreaking Newsఆరోగ్యంపండుగలు

ఆదివారం రధ సప్తమి.. మటన్, చికెన్ తినొచ్చునా..!

ఆదివారం వచ్చిందంటే నాన్ వెజ్ లేనిదే ముద్ద దిగదు. అలాంటిది ఆదివారం (జనవరి 25) రథసప్తమి వచ్చింది. అయితే ఈరోజు మాంసాహారం తినవచ్చునా లేదా అనే విషయాలపై తెలుసుకుందాం..

ఆదివారం రధ సప్తమి.. మటన్, చికెన్ తినొచ్చునా..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

ఆదివారం వచ్చిందంటే నాన్ వెజ్ లేనిదే ముద్ద దిగదు. అలాంటిది ఆదివారం (జనవరి 25) రథసప్తమి వచ్చింది. అయితే ఈరోజు మాంసాహారం తినవచ్చునా లేదా అనే విషయాలపై తెలుసుకుందాం..

పండితులు చెప్పిన వివరాల ప్రకారం.. రథసప్తమి రోజున సూర్య భగవానుడిని ఆరాధిస్తారు. రథసప్తమి రోజున మాంసాహారం తినక పోవడమే మంచిది అని చెబుతున్నారు. అయితే హిందువులు పవిత్ర దినాలలో పండుగల సమయంలో.. కార్తీక మాసం, ధనుర్మాసం.. ఇలా చాలా రోజులలో శాఖాహారం తీసుకోవడం సాంప్రదాయంగా వస్తుంది.

అలాంటిది రథసప్తమి ఆదివారం రావడం ఆచారం ప్రకారం పండుగ పవిత్రతను కాపాడేందుకు మాంసాహారం తినకూడదని పెద్దలు చెబుతున్నారు. రథసప్తమి రోజు మాంసాహారం తింటే అదృష్టం పోయి.. దురదృష్టం వెంటాడుతుందని పండితులు పెద్దలు చెబుతున్నారు. పండుగ రోజు దేవుడికి పవిత్రమైన పూజలు, ఉపవాసాలు పాటిస్తారు. ఆ సమయంలో శాఖాహారం శరీరం మరియు మనస్సుకు శుద్ధి చేస్తుందని విశ్వాసం.

Disclaimer : ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే పండితుల సలహాలు, ఇంటర్నెట్ ఆధారంగా రూపొందించబడింది.

MOST READ :: 

  1. Medaram : మేడారం జంపన్న వాగులో మునిగిన భక్తులు.. కాపాడిన SDRF బృందం..!

  2. Gold Price : తగ్గినట్టే తగ్గి రికార్డు సృష్టించిన బంగారం ధర.. ఈరోజు తులం ఎంతంటే..!

  3. Farmer Registration : రైతులకు కీలక సూచన.. ప్రతి రైతు ఫార్మర్‌ రిజిస్టేషన్‌ చేసుకోవాలి..!

  4. Rythu Bharosa : రైతుల ఖాతాలలో రైతు భరోసా.. ప్రభుత్వం తాజా నిర్ణయం, లేటెస్ట్ అప్డేట్..!

మరిన్ని వార్తలు