BREAKING : కేసు నమోదయిందని.. భయంతో వ్యక్తి ఆత్మహత్య..!

BREAKING : కేసు నమోదయిందని.. భయంతో వ్యక్తి ఆత్మహత్య..!
వెల్దండ, మన సాక్షి:
వెల్దండ మండలం కొట్ర చౌరస్తా సమీపంలోని వ్యవసాయ పొలంలో ఓ వ్యక్తి ఉరేసుకొని మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన బాలకృష్ణ (27) గురువారం తెల్లవారుజామున కొట్ర చౌరస్తా సమీపంలోని వ్యవసాయ పొలంలో చెట్టుకు ఉరేసుకొని విగతజీవిగా కనిపించారు. ఇది గమనించిన స్థానిక రైతులు పోలీసులకు సమాచారం అందించారు.
ఈ మేరకు.. ఘటన స్థలానికి చేరుకొని పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి మృతికి గల కారణాలను తెలుసుకున్నారు. ఈ వ్యక్తి గత కొద్ది రోజుల క్రితం యాక్సిడెంట్ కేసులో నిందితుడిగా ఉన్నాడని, ఆదిభట్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యిందని తెలిపారు. దీంతో భయాందోళనకు గురై ఉరివేసుకొని మృతి చెంది వుంటాడని పోలీసులు అనుమానించారు. మృతునికి భార్య కుమారుడు, ఒక కూతురు ఉన్నట్టు తెలిపారు.
MOST READ :
- డిజిటల్ మనీ మార్పిడి లో ఇలా చేస్తే ఖాతా ఖాళీ, జాగ్రత్తలు తీసుకోకుంటే సైబర్ మోసాల్లో చిక్కుకున్నట్టే..!
- District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. ముగ్గురు డాక్టర్లు, ముగ్గురు సిస్టర్లు సస్పెండ్..!
- TG : తెలంగాణలో దారుణం.. ముగ్గురు పిల్లలను చెరువులో ముంచి చంపిన తండ్రి..!
- Hyderabad : ఎకోపార్కులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..!









