అకస్మాత్తుగా బైకులో మంటలు.. శ్రీశైలం రహదారిపై దగ్ధమైన ద్విచక్ర వాహనం..!
ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనంలో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగి పో పల్సర్ బైక్ పూర్తిగా దగ్ధమైంది. ఘటన జిల్లా హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారిపై ఉదయం 11:00 గంటలకు జరిగింది.

అకస్మాత్తుగా బైకులో మంటలు.. శ్రీశైలం రహదారిపై దగ్ధమైన ద్విచక్ర వాహనం..!
వెల్దండ, మన సాక్షి:
ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనంలో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగి పో పల్సర్ బైక్ పూర్తిగా దగ్ధమైంది. ఘటన జిల్లా హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారిపై ఉదయం 11:00 గంటలకు జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం కంబాలపల్లి సాయి గురువారం దండ మండల పరిధిలోని పెద్దాపూర్ గ్రామంలో ఓ కార్యక్రమానికి వచ్చారు.
శుక్రవారం ఉదయం పెద్దాపూర్ నుంచి గోవిందాయ పల్లికి తిరిగి వెళుతుండగా ఇండియన్ పెట్రోల్ బంకులో పెట్రోల్ పోసుకొని రోడ్డు ఎక్కగానే తన ద్విచక్ర వాహనంలో ఒక్కసారిగా మంటలు మంటలు చెలరేగాయని తెలిపారు.
ఈ ఘటనలో బైకు పూర్తిగా కాలిపోగా వాహన చోదకుడు వెంటనే అప్రమత్తమై ప్రాణాలతో బయటపడ్డారు. స్థానికులు మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా పూర్తిగా దగ్ధమైంది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాద పరిస్థితిని పరిశీలించి వివరాలు సేకరించారు.









