Breaking Newsతెలంగాణరాజకీయంహైదరాబాద్
BREAKING : తెలంగాణ ప్రభుత్వ సలహదారుల నియామకం
BREAKING : తెలంగాణ ప్రభుత్వ సలహదారుల నియామకం
మనసాక్షి :
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రకటించింది. ప్రభుత్వ సలహాదారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వం తాజా నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ఊరట కలిగినట్లయింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులను ముగ్గురిని ప్రభుత్వ సలహాదారులుగా నియమించింది.
ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవిని నియమించిందివ ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సలహాదారులుగా వేం నరేందర్ రెడ్డిని నియమించారు.
* వేం నరేందర్ రెడ్డి – ప్రభుత్వ సలహాదారు
* షబ్బీర్ అలీ – ఎస్సీ ఎస్టీ మైనార్టీ వెల్ఫేర్
* హర హర వేణుగోపాల్ – ప్రోటోకాల్ , పబ్లిక్ రిలేషన్
* మల్లు రవి – ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధి
ALSO READ : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీ, దరఖాస్తుల ఆహ్వానం..!









