Crime News : భార్యను హత్య చేసిన కసాయి భర్త..!
Crime News : భార్యను హత్య చేసిన కసాయి భర్త..!
మల్లాపూర్, (మన సాక్షి)
భార్య పై అనుమానం తో హత్య చేసిన సంఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం లో చోటుచేసుకుంది. పోలీసులు తెలుపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వేంపల్లి గ్రామానికి చెందిన వెలుమల రమేష్( 35) , కులం తెనుగు అనునతనికి 2015 వ సం, అల్లిపూర్ గ్రామానికి చెందిన సునీత (26 ) తో వివాహం అయింది. వారికి ఒక కూతురు (8) ఒక కొడుకు (6) కలరు. రమేష్ ఉపాది నిమిత్తం దుబాయ్ దేశం వెళుతూ ఉంటాడు.
రమేష్ సుమారు నెలరోజుల క్రితం దుబాయ్ నుంచి తిరిగి వచ్చినాడు అప్పటినుండి తన భార్య సునీతను ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకుందని తరచూ తిట్టడం కొట్టడం చేస్తూ ఉండేవాడు. అయిన కూడా అతనికి అనుమానం తీరకపోవడంతో..
బుధవారం ఉదయం రమేష్ తన భార్యకు ఎవరితోనో అక్రమ సంబంధం ఉందని గొడవ పెట్టుకుని తన భార్యను ముక్కుపై, ఎడమ కన్ను పై కొట్టడంతో తీవ్ర రక్త స్రావమైనది. ఆమె గొంతు పిసికి చంపివేసినాడు. సునీత తండ్రి మందుల గంగరాజం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనైనది. సంఘటన స్థలాన్ని మల్లాపూర్ ఎస్పై కిరణ్ కుమార్ , మెట్ పల్లి డి.ఎస్.పి ఉమామహేశ్వరరావు , కోరుట్ల సి ఐ సురేష్ బాబు పరిశీలించారు.
MOST READ :
-
Employees : మేం లంచం తీసుకోం.. ఉద్యోగులు వినూత్న కార్యక్రమం..!
-
Diwali : దీపావళి అనే ఊరు ఉంది తెలుసా..? అది ఎక్కడో కాదు మన తెలుగు రాష్ట్రాల్లోనే..!
-
Miryalaguda : దీపావళి మంగళహారతులు ఏరోజు.. పండుగ జరుపుకునేది ఎప్పుడు..!
-
TG News : రోడ్డు పక్కన కుప్పలుగా కరెన్సీ నోట్లు, దొరికినన్ని ఏరుకున్నారు.. అంత డబ్బు ఎక్కడిదంటే..!
-
Gold Price : గోల్డెన్ డేస్.. దీపావళికి మరోసారి షాక్, తులం బంగారం ధర ఎంతంటే..!









