Breaking Newsఆంధ్రప్రదేశ్క్రైం

అన్నమయ్య జిల్లాలో ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి..!

అన్నమయ్య జిల్లాలో ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి..!

రామసముద్రం, మనసాక్షి :

అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలంలో గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది.

స్థానిక ఎస్సై వివరాలమేరకు పుంగనూరు మండలం దిగువపల్లెకు చెందిన వెంకటరమణ (59,)పతెమ్మ గారి పల్లెకు చెందిన గంగాధర్ (44) ఇరువురు తమ పవర్ ఎక్సల్ ఏ పి o3 సిసి 4181 వాహనంపై వనగాని పల్లె సమీపంలోని ఓ కోళ్ల ఫారం నుండి బయలుదేరి పుంగనూరు కు వెళుతుండగా నాయుడుపేట నుండి చిక్బలాపురం వైపు వస్తున్న లారీ ఏ పి 39 యూ వి 0961 డీకొని ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.

విషయం తెలుసుకున్న ఎస్సై వెంకటసుబ్బయ్య, పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మృత దేహాలను శవ పరీక్షల నిమిత్తం పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు వెంకటరమణ కుమారుడు శ్రీనివాసులురెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

MOST READ : 

  1. Hyderabad : భార్యను చంపి ముక్కలు చేసిన ఘటన.. వెలుగులోకి సంచలన విషయాలు..!

  2. Khammam : నాన్నతో కలిసి శిలపలు తొక్కేది.. మహిళా కూలీలతో మంత్రి పొంగులేటి ఆసక్తికర వ్యాఖ్యలు..!

  3. District collector : మరోసారి ధరఖాస్తు చేసుకోవచ్చు.. నిరంతర ప్రక్రియ.. జిల్లా కలెక్టర్..!

  4. TG News : తెలంగాణలో మందుబాబులకు అదిరిపోయే గుడ్ న్యూస్..!

  5. SBI : SBI సేవింగ్ అకౌంట్ లో రూ.236 కట్ అవుతున్నాయా.. ఖాతాదారుల గందరగోళం.. ఎందుకంటే..!

మరిన్ని వార్తలు