Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డి
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఇంట్లో భారీ చోరీ..!
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఇంట్లో భారీ చోరీ..!
రాజేంద్రనగర్, మనసాక్షి :
ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఇంట్లో భారీ చోరీ జరిగిన సంఘటన నర్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం…నర్సింగ్ పరిధిలో ని కిష్టారెడ్డి కాలనిలో నివాసముంటున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి హరి బాబు ఓ ఫంక్షన్ నిమిత్తం విజయవాడ కి వెళ్లి తిరిగి మంగళవారం తెల్లవారుజామున ఇంటికి వచ్చి చూసేసరికి కొందరు దుండగులు ఇంటి తాళంను పగలగొట్టి ఇంట్లో ఉన్న 100 తులాల బంగారం తో పాటు ఓ లాప్ దొంగలించి పారిపోయారు. దీంతో బాధితుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ALSO READ :
చట్నీలో ఎలుక.. జేఎన్టీయూ కళాశాలలో కలకలం, మంత్రి ఆరా..!
Electricity Bill : మీ కరెంట్ బిల్లు ఈజీగా ఇలా చెల్లించండి.. మొబైల్ తోనే చెల్లించవచ్చు..!









