గడ్డివామి దగ్ధం.. రూ.50,000 ఆస్తి నష్టం..!
గడ్డివామి దగ్ధం.. రూ.50,000 ఆస్తి నష్టం..!
రామసముద్రం, మనసాక్షి
అన్నమయ్య జిల్లా పుంగనూరు అగ్నిమాపక కేంద్ర పరిధిలో ని రామసముద్రం మండలం అన్నమయ్య జిల్లా గుంతలపేట లో అర్ధరాత్రి అగ్ని ప్రమాద వార్త వచ్చినది వెంటనే సిబ్బందితో ప్రమాద జరిగి గడ్డివామి దగ్ధమైంది. శ్రీనివాస కి చెందిన వరిగడ్డి వామి అగ్ని ప్రమాదానికి గురైనది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వెంటనే సిబ్బందితో సెల్ఫ్ ట్యాంక్ నీటితో మంటలను అదుపు చేయడం జరిగింది.
ఈ అగ్ని ప్రమాదానికి కారణం ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టుట వలన అగ్నిప్రమాదం జరిగినట్లు యజమాన్యం తెలియజేయడం జరిగింది. ఈ అగ్ని ప్రమాదం నందు వరిగడ్డి వామి రాతి కూసాలు మరియు ఐరన్ షీట్లుతో కప్పబడిన షెడ్డు అగ్నికి గురి అయినది. నష్టము సుమారు 50,000 రూపాయల వరకు ఉండొచ్చు. ఈ అగ్ని ప్రమాదం నందు పాల్గొన్న సిబ్బంది సి. సుమన్, ఎం.లోకేష్ రెడ్డి, వి. కేశవ మరియు ప్రకాష్ పాల్గొనడం జరిగింది.
MOST READ :









