NALGONDA : ఆ రెండు పార్టీలకు ఇంకా బుద్ధి రావడం లేదు – గుత్తా సుఖేందర్ రెడ్డి

ఆ రెండు పార్టీలకు ఇంకా బుద్ధి రావడం లేదు – గుత్తా సుఖేందర్ రెడ్డి
నల్గొండ , మనసాక్షి :
కర్ణాటక ఎన్నికల తర్వాత అటు బిజెపికి, ఇటు కాంగ్రెస్ కు బుద్ధి రావడం లేదని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం నల్గొండ లోని క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.
సుఖేందర్ రెడ్డి కామెంట్స్ :
- కర్ణాటక లో చిత్తుగా ఓడినా,బీజేపీ వాళ్లకు ఇంకా బుద్ధి రావడం లేదు.
- తెలంగాణలో అస్సాం సీఎం బిశ్వంత్ శర్మ చేసిన వ్యాఖ్యలు సరైనవి కాదు.మత కల్లోలాలు లేపి ఎలాగైనా అధికారంలోకి రావలన్నదే బీజేపీ పార్టీ కుట్ర.
- కాంగ్రెస్ కు కూడా ఇంకా బుద్ధి రావడం లేదు.నాలుగు రోజులైనా ఇంకా కర్ణాటక లో సీఎం ని నిర్ణయించే స్వేచ్ఛ ఆ పార్టీ లో లేదు. ఈ కాంగ్రెస్ పార్టీ దేశానికి ఎలాంటి నాయకత్వం వహిస్తుందో అనేది ప్రజలు ఆలోచన చేయాలి.
- కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణ లో కాంగ్రెస్ వాళ్ళు ఊహల్లో తెలియాడుతున్నారు
- తెలంగాణ లో కాంగ్రెస్ ,బీజేపీ పార్టీల పప్పులు ఉడకవు.
ఇక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే యావత్ తెలంగాణ సమాజం నడుస్తుంది. - రాజస్థాన్ లో కాంగ్రెస్ కల్లోలం చూస్తూనే ఉన్నాం..అక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులే తిరుగు బాటు చేసి, రాజకీయ అస్థిరత్వం తెచ్చారు.
- మతోన్మాద బీజేపికి, దిక్కు దివానా లేని కాంగ్రెస్ పార్టీల పట్ల అప్రమత్తంగా ఉండాలి.
- ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే కేసీఆర్ నాయకత్వంమే శరణ్యం.
కర్ణాటక లో బీజేపీకి ప్రజలు సరైన బుద్ధి చెప్పారు. - అంతర్గత విభేదాలతో నానాటికి కాంగ్రెస్ పార్టీ కునారిల్లి పోతుంది.
- కె .సీ.ఆర్ నాయకత్వంలోనే దేశం ,రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది.