NPCI : ఎన్పీసీఐ భారత్ బిల్పే, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ సహకారం..!

NPCI : ఎన్పీసీఐ భారత్ బిల్పే, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ సహకారం..!
ముంబై, మన సాక్షి :
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) యొక్క అనుబంధ సంస్థ ఎన్పీసీఐ భారత్ బిల్పే (ఎన్బీబీఎల్), ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్తో జట్టు కట్టి, ఎన్సీఎంసీ (నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్) ఆధారిత రూపే ఆన్-ది-గో కార్డ్ల రీచార్జ్ను భారత్ కనెక్ట్ (బీబీపీఎస్) ప్లాట్ఫామ్లో అనుసంధానం చేసింది.
దీని ఫలితంగా, యూజర్లు భారత్ కనెక్ట్ ఆధారిత ఏదైనా యాప్ ద్వారా తమ కార్డ్లను సులభంగా టాప్-అప్ లేదా రీచార్జ్ చేసుకోవచ్చు.
ఎన్సీఎంసీ ప్రయోజనాలు: ఎన్సీఎంసీ ప్రోగ్రాం భారత్లోని వివిధ నగరాల్లో ప్రజా రవాణా వ్యవస్థలను సులభతరం చేస్తుంది. ఒకే కార్డుతో మెట్రోలు, బస్సుల్లో నిరాటంకంగా, కాంటాక్ట్లెస్గా ప్రయాణించే అవకాశం కల్పిస్తుంది.
దీనివల్ల రోజువారీ ప్రయాణికులు రీచార్జ్ పాయింట్ల వద్ద సుదీర్ఘ క్యూలలో నిరీక్షించాల్సిన అవసరం తప్పుతుంది. ఈ వ్యవస్థ ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా నగదురహిత లావాదేవీలను ప్రోత్సహిస్తుంది.రీచార్జ్ ప్రక్రియ: కస్టమర్లు భారత్ కనెక్ట్ ఆధారిత యాప్లో ‘ఎన్సీఎంసీ రీచార్జ్’ ఎంపికను ఎంచుకొని, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ను సెలెక్ట్ చేస్తే, తమ రూపే ఆన్-ది-గో కార్డ్ను రీచార్జ్ చేసుకోవచ్చు.
మొబైల్ నంబర్ మరియు కార్డు యొక్క ఆఖరి నాలుగు అంకెలను నమోదు చేస్తే, ప్లాట్ఫాం ప్రస్తుత బ్యాలెన్స్తో పాటు కనిష్ట, గరిష్ట రీచార్జ్ మొత్తాలను చూపిస్తుంది. మొబైల్ నంబర్ ఆధారంగా రీచార్జ్ చేయడం వల్ల సౌకర్యం పెరగడమే కాక, కార్డు వివరాలను వెల్లడించాల్సిన అవసరం లేకుండా భద్రత కూడా ఉంటుంది.
రీచార్జ్ పరిమితి, ఉపయోగం: భారత్ కనెక్ట్ ఆధారిత యాప్ల ద్వారా కస్టమర్లు తమ ఎన్సీఎంసీ ఎనేబుల్డ్ కార్డ్లను రూ. 2,000 వరకు టాప్-అప్ చేసుకోవచ్చు. రీచార్జ్ విజయవంతమైన తర్వాత, నిర్దేశిత టెర్మినల్పై కార్డును ట్యాప్ చేయడం ద్వారా బ్యాలెన్స్ అప్డేట్ అవుతుంది.
ఈ కార్డ్లను ముంబై మెట్రో, ఢిల్లీ మెట్రో, ఎన్సీఆర్టీసీ, గుజరాత్ మెట్రో వంటి మెట్రో రూట్లతో పాటు వివిధ రాష్ట్ర బస్సు సేవల్లో ఉపయోగించవచ్చు. ఎన్బీబీఎల్ సీఈవో నూపుర్ చతుర్వేది మాట్లాడుతూ: “ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ యొక్క ఎన్సీఎంసీ కార్డ్లను భారత్ కనెక్ట్తో అనుసంధానం చేయడం ఆనందంగా ఉంది.
ఇకపై కార్డ్హోల్డర్లు సుదీర్ఘ క్యూలలో నిరీక్షించకుండా, తమకు నచ్చిన పేమెంట్ యాప్ ద్వారా సురక్షితంగా, సౌకర్యవంతంగా రీచార్జ్ చేసుకోవచ్చు. డిజిటల్ చెల్లింపులను సరళీకరించే దిశగా ఇది ముఖ్యమైన అడుగు.” అని అన్నారు.
ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ సీఓఓ గణేష్ అనంతనారాయణన్ మాట్లాడుతూ… “ఈ భాగస్వామ్యం సౌకర్యవంతమైన రీచార్జ్ సౌలభ్యాన్ని అందిస్తుంది. యూజర్లకు అనువైన, వినూత్న సొల్యూషన్స్ అందించడంలో మా నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.” అని పేర్కొన్నారు.
Similar News :
-
UPI : బిగ్ అలర్ట్.. మార్కెట్లోకి నకిలీ ఫోన్ పే, గూగుల్ పే యాప్స్..!
-
UPI : గూగుల్ పే, ఫోన్ పే వినియోగదారులకు బిగ్ అలర్ట్.. నేటి నుంచి ఆ నెంబర్లు పనిచేయవు..!
-
UPI : ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా.. యూపీఐ లావాదేవీలకు కేంద్రం గుడ్ న్యూస్..!
-
UPI : యూపీఐ చెల్లింపుల్లో నయా మోసం.. క్షణాల్లో ఖాతా ఖాళీ..!
-
UPI : ఫోన్ పే, గూగుల్ పే లో నేటి నుంచి యూపీఐ కొత్త రూల్స్.. మీ ఖాతాలలో డబ్బులు బ్లాక్..!









