తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Nalgonda : అద్దంకి – నార్కట్ పల్లి రహదారిపై పోలీస్ కుటుంబ సభ్యుల రాస్తారోకో..!

Nalgonda : అద్దంకి – నార్కట్ పల్లి రహదారిపై పోలీస్ కుటుంబ సభ్యుల రాస్తారోకో..!

నల్లగొండ, మనసాక్షి :

తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 12 బెటాలియన్ పోలీస్ ఉదోగ్యుల కుటుంబ సభ్యులు సోమవారం బెటాలియన్ ముందు నార్కట్ పల్లి అద్దంకి రహదారి పై రాస్తారోకో చేసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ

డ్యూటీల విషయంలో పై అధికారులు కింది స్థాయి ఉద్యోగులను వొత్తడికి గురి చేస్తున్నారని ఆరోపణచేసారు. కొత్తగా అమలులోకి వచ్చే రికార్డు పద్ధతని ఉపసంహరించుకోవాలి అని డిమాండ్ చేశారు.

పని భారాన్ని 8 గంటలకు తగ్గించాలని
పారామిలటరీ గా చెపుతున్న ఈ వ్యవస్థలో సివిల్ ఆర్ లాగా ఫ్యామిలీ కన్వీనెంట్గా 5 సంవత్సరాలు ఫిక్సెడ్ పోస్టింగ్ ఇవాలన్నారు. ఆర్డబ్ల్యు వ్యవస్థను రద్దు చేయాకానీ , రూల్ కాల్ వ్యవస్థను సివిల్ ఆర్ మాదిరిగానే పెట్టాలని కామన్ మెస్ ని తీసి వేయాలని కోరారు.

LATEST UPDATE : 

మరిన్ని వార్తలు