మొక్కు తీర్చుకోవడానికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం
30 మందికి తీవ్ర గాయాలు

మొక్కు తీర్చుకోవడానికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం
30 మందికి తీవ్ర గాయాలు
రుద్రంగి, (మనసాక్షి)
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాల గ్రామానికి చెందిన దులూరి సాయిలు కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులతో కలిసి
బడా పహాడ్ లో దేవుని మొక్కులు తీర్చుకోవడానికి డీసీఎంలో వెళ్తుండగా మార్గం మధ్యంలో నిజామాబాద్ జిల్లా చందూర్ ప్రాంతంలో డీసీఎం బోల్తా పడి 30 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.
మే 11వ తేదీ గురువారం అర్ధరాత్రి 1:30 సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే స్పందించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చి గాయపడిన వారిని 108 వాహనాల్లో నిజామాబాద్ జిల్లా ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.