Additional collector : సదర్ సమ్మేళన్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి.. అదనపు కలెక్టర్..!
Additional collector : సదర్ సమ్మేళన్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి.. అదనపు కలెక్టర్..!
సూర్యాపేట, మన సాక్షి :
జిల్లాలో సదర్ సమ్మేళన్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ పి. రాంబాబు అన్నారు. గురువారం ఐడిఓసి సమావేశ మందిరం నందు జిల్లాలోని యాదవ కులస్తుల ప్రముఖులతో నిర్వహించిన సదరన్ సమ్మేళన్ సన్నాక సమావేశంలో అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సదరన్ సమ్మేళన్ ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించింది,
జిల్లాలో సదర్ సమ్మేళన్ ఉత్సవాలను నిర్వహించుటకు గాను యాదవ కులస్తుల పెద్దలతో సమావేశం ఏర్పాటు చేసి సదర్ ఉత్సవాలను ఏ విధంగా నిర్వహించాలి, ఉత్సవాలు నిర్వహించే తేదీ. స్థలము గురించి చర్చించారు. అందరు సమావేశం ఏర్పరచుకొని కుల పెద్దలతో కమిటీ వేసుకోని తెలుపవలసిందిగా అదనపు కలెక్టర్ సంబంధిత కుల పెద్దలకు సూచించారు.
ఈ కార్యక్రమంలో తేలంగాణ రైతు సంక్షేమ బోర్డు సభ్యులు చేవిటి వేంకన్న, డా,,రామ్మూర్తి, సి.హెచ్. వెంకన్న యాదవ్, లింగమంతుల దేవస్థానం మాజి చైర్మన్ కోడి సైదులు యాదవ్, పల్లెబోయిన నరసయ్య యాదవ్, యాదవ ఉద్యోగుల ఎంప్లాయిస్ ప్రెసిడెంట్ మట్టపల్లి రాము యాదవ్, వజ్జా వీరయ్య తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
Gold Price : గోల్డ్ రేట్ మరింత పతనం.. కొనుగోలుకు ఇదే ఛాన్స్..!
-
TGSRTC : కార్తీక పౌర్ణమికి ఆర్టీసీ గుడ్ న్యూస్.. హైదరాబాద్ తో పాటు జిల్లా కేంద్రాలలో ప్రత్యేక బస్సులు..!
-
Miryalaguda : ఎస్ వి మోడల్ హైస్కూల్లో బాలల దినోత్సవం..!
-
BREAKING : లగచర్ల ఘటనలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్.. వికారాబాద్ తరలింపు..!









