నవజాత శిశువు మృతదేహం

నవజాత శిశువు మృతదేహం
కొమరం భీం ఆసిఫాబాద్, మన సాక్షి.
చింతల మానేపల్లి మండల కేంద్రంలో శనివారం తెల్లవారుజామున నవజాత శిశువు మృతదేహం కనిపించిండం కాలనీవాసులను భయభ్రాంతులకు గురిచేసింది స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు శిశువు మృతదేహాన్ని పరిశీలించారు.
ఘటనకు సంబంధించిన విషయంపై ఎస్సై దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు. శిశువు అప్పుడే పుట్టినట్లు అనుమానాలు వ్యక్తమౌతుండడం ఇలాంటి ఘటన స్థానికుల్లో భయాందోళనకు గురి చేస్తుంది. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసినట్లు పేర్కొన్నారు