Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Uncategorized

తెలంగాణలో.. దేశంలోనే అత్యుత్తమగా హైకోర్టు సముదాయం.. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్

నూతన హైకోర్టు సముదాయం దేశంలోనే అత్యుత్తమ హైకోర్టుగా నిలుస్తుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. రాజేంద్రనగర్ లో తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జోన్-II భవన నిర్మాణా పనులకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి తో కలిసి శంకుస్థాపన చేసారు.

తెలంగాణలో.. దేశంలోనే అత్యుత్తమగా హైకోర్టు సముదాయం.. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్

తెలంగాణ గడ్డపై న్యాయ స్ఫూర్తి విరాజిల్లాలి – సీఎం రేవంత్ రెడ్డి

రాజేంద్రనగర్, మనసాక్షి :

నూతన హైకోర్టు సముదాయం దేశంలోనే అత్యుత్తమ హైకోర్టుగా నిలుస్తుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. రాజేంద్రనగర్ లో తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జోన్-II భవన నిర్మాణా పనులకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి తో కలిసి శంకుస్థాపన చేసారు. అనంతరం సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ ఎస్.వి. భట్టి,జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ,జస్టిస్ పి.ఎస్. నరసింహ, తెలంగాణ హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ అపరేష్ కుమార్ సింగ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామక్రిష్ణా రావు, డీజీపీ శివధర్ రెడ్డి లతో కలిసి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ హై కోర్టు భవన నమూనా ఫోటో ప్రదర్శన ను తిలకించారు.

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ. .ఇక్కడ రానున్న తెలంగాణ హైకోర్టు సముదాయం దేశంలోనే అత్యుత్తమ హైకోర్టుగా నిలుస్తుందని అన్నారు. కోర్టు గదులు, పరిపాలనా భవనాలు, ఆర్కైవ్స్, నివాస మౌలిక సదుపాయాలు, శిక్షణా సౌకర్యాలు అన్నీ ఒకే ప్రాంగణంలో సమగ్రంగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. న్యాయవ్యవస్థ ఇక్కడ తన సొంత నిబంధనల ప్రకారం, తన సొంత పరిధిలో పనిచేస్తుంది. మనం సిద్ధాంతం నుండి ఆచరణలోకి మారినప్పుడు సంస్థాగత స్వయం సమృద్ధి ఇలాగే ఉంటుంది,” అని ఆయన అన్నారు.

ఈ ఆడిటోరియంలో జిల్లా న్యాయవ్యవస్థ కోసం న్యాయ సదస్సు శిక్షణా కార్యక్రమాలు, పౌరుల కోసం న్యాయ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. “నేర్చుకోవడం మానేసిన న్యాయవ్యవస్థ పరిణామం చెందడం కూడా ఆపేస్తుంది. నేను దేశవ్యాప్తంగా దీనిని చూశాను మరియు ఈ సంప్రదాయాన్ని బలంగా, దృఢంగా సమర్థిస్తున్నాను,” అని ఆయన అన్నారు. మూడు అంతస్తులలో రూపొందించిన సెంట్రల్ రికార్డ్ రూమ్ కూడా అంతే ముఖ్యమైనదని ఆయన పేర్కొన్నారు.

“సంస్థాగత స్మృతి అనేది ఒక విలాసం కాదు. అది న్యాయపరమైన తార్కికతలో స్థిరత్వానికి పునాది. చక్కగా భద్రపరచబడిన మరియు అందుబాటులో ఉన్న పూర్వ తీర్పులు, ఆ తర్వాత వచ్చే ప్రతి తీర్పును బలోపేతం చేస్తాయి. దీనికి తగినంత ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఇవ్వడం చూసి నేను సంతోషిస్తున్నాను,” అని ఆయన అన్నారు.”ఆ చిత్తశుద్ధి, గంభీరత ప్రణాళికలోని మరో అంశంలో కూడా కనిపిస్తున్నాయి. సుస్థిరమైన మౌలిక సదుపాయాలను మొదటి నుంచే డిజైన్‌లో పొందుపరిచారు.

తరతరాల న్యాయమూర్తులకు, వ్యాజ్యదారులకు సేవలందించే ప్రాంగణం, అది ఉన్న భూమిని గౌరవించాలి,” అని సీజేఐ అన్నారు. కొత్త భవనం కోసం 100 ఎకరాలు కేటాయించడమే కాకుండా, ఈ ప్రాజెక్టుకు రూ. 2,500 కోట్లకు పైగా మంజూరు చేసినందుకు ఆయన తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. రాబోయే 100 ఏళ్ల పాటు సేవలందించేలా రూపొందించబడిన ఈ కొత్త హైకోర్టు ప్రాంగణం రెండేళ్లలో పూర్తవుతుంది. 2024లో శంకుస్థాపన జరిగిన జోన్-I పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేస్తూ, జోన్-II ఒక న్యాయస్థానం అంత ముఖ్యమైనదిగా ఉంటుందని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తెలంగాణ గడ్డపై న్యాయ స్ఫూర్తి విరాజిల్లాలని, అన్ని వర్గాల ప్రజల సమస్యలకు పరిష్కారం చూపే ‘న్యాయ దేవాలయం’గా కొత్త హైకోర్టు నిలుస్తుందని అన్నారు. సామాన్య పౌరుడికి కోర్టు చివరి ఆశ్రయమని, అలాంటి పవిత్ర ప్రాంగణాన్ని నిర్మించే అవకాశం తమ ప్రభుత్వానికి దక్కడం చరిత్రాత్మకమని అభిప్రాయపడ్డారు. రాబోయే వంద ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థల మధ్య పరస్పర గౌరవమే లక్ష్యంగా ఈ భారీ నిర్మాణాన్ని చేపట్టినట్లు ప్రకటించారు.

తెలంగాణలో ప్రజా ​ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తీసుకున్న కీలక నిర్ణయాల్లో భాగంగా 100 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు తెలిపారు. ఇప్పటికే జోన్-I పనులు శరవేగంగా సాగుతున్నాయని, నేడు శంకుస్థాపన చేసిన జోన్-II నివాస సముదాయాలను కూడా డిసెంబర్ 2027 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. దేశంలోనే అత్యంత ఆధునిక ప్రమాణాలతో రూపుదిద్దుకుంటున్న ఈ సముదాయం తోపాటు రాష్ట్రవ్యాప్తంగా మరో 49 కోర్టుల నిర్మాణ పనులు కూడా కొనసాగుతున్నాయని వెల్లడించారు.

న్యాయవ్యవస్థ ఇచ్చే తీర్పులకే కాకుండా వారి అమూల్యమైన అభిప్రాయాలకు కూడా తమ ప్రభుత్వం అత్యున్నత విలువ ఇస్తుందని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. హైదరాబాద్ నగర కీర్తి కిరీటంలో మరో మణిహారంగా నిలిచే ఈ అద్భుత కట్టడం, భవిష్యత్ తరాలకు న్యాయ విజ్ఞాన కేంద్రంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేవలం భవనాల నిర్మాణం మాత్రమే కాకుండా, ప్రజలందరికీ త్వరితగతిన న్యాయం అందించే స్ఫూర్తిని బలోపేతం చేయడమే తమ ప్రధాన ఉద్దేశమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ సెక్రెటరీ వికాస్ రాజ్, జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్ జి కర్ణన్, జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి, ఆర్డీవో రాజేంద్రనగర్ వెంకట్ రెడ్డి తహసిల్దార్ రాములు న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు