Breaking Newsక్రైంజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా
పిడుగుపడి 30 మేకలు మృతి..!
పిడుగుపాటుకు 30 మేకలు మృత్యువాత పడ్డాయి.సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం రేవూరు గ్రామంలో ఈ ఘటన జరిగింది.

పిడుగుపడి 30 మేకలు మృతి..!
మేళ్లచెరువు, మన సాక్షి :
పిడుగుపాటుకు 30 మేకలు మృత్యువాత పడ్డాయి. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం రేవూరు గ్రామంలో ఈ ఘటన జరిగింది. రేవూరులో గురువారం రాత్రి కురిసిన వర్షానికి పొలంలో ఉన్న మేకలు సమీపంలోని చెట్టుకిందకు వెళ్లి తలదాచుకున్నాయి.
అక్కడే పిడుగు పడటంతో అమరబోయిన వీరయ్యకు చెందిన 20, సాదం ఆదినారాయణ, మూర్తి గంగరాజుకు చెందిన చెరి 5 మేకలు కలిపి 30 మేకలు మృతి చెందాయి. ఆ రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సర్పంచి జువ్వెనబోయిన గురవయ్య కోరారు.









