వేములపల్లి : తమ్మినేనికి ఘన స్వాగతం
వేములపల్లి : తమ్మినేనికి ఘన స్వాగతం
వేములపల్లి, మన సాక్షి
నల్గొండ జిల్లా, వేములపల్లి మండలం సీపీఎం పార్టీ కార్యాలయం దగ్గర సిపిఐ ఎం పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు , మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డికు , సిపిఎం పార్టీ ఎంపిటిసి చైతన్య ప్రణీత్ రెడ్డి, రైతు సంఘం మండల అధ్యక్షుడు పాల్వాయి రాంరెడ్డి మండల నాయకలు ,ఘనంగా స్వాగతం పలికారు.
సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జనచైతన్య యాత్ర ఈనెల 17న హనుమకొండలో ప్రారంభమై సోమవారం ఉదయం 8.00 గంటలకు
వేములపల్లి మండలంలోకి జన చైతన్య బస్సు యాత్ర , మోటార్ సైకిల్ ర్యాలీ తో వచ్చిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సిపిఐ ఎం పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకి ,జూలకంటి రంగారెడ్డికి , మల్లు లక్ష్మికి సిపిఎం పార్టీ మండల నాయకుల ఆధ్వర్యంలో ఎంపిటిసి చైతన్య ప్రణీత్ రెడ్డి, మండల రైతు సంఘం అధ్యక్షులు పాల్వాయి రాంరెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు పుట్టల సైదులు, పూలదండలు వేశారు.,
ఈ కార్యక్రమంలో కోడి రెక్క వెంకన్న, వడ్ల బ్రహ్మచారి, సైదులు, తదితరులు పాల్గొన్నారు.









