మిర్యాలగూడ: ఘనంగా సన్మానం
మిర్యాలగూడ: ఘనంగా సన్మానం
మిర్యాలగూడ, మనసాక్షి :
ఇటీవల నల్లగొండ లో జరిగిన తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టుల సంఘం సమావేశం లో జిల్లా ఉపాధ్యక్షులుగా కాతోజు నాగాచారి ని ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా మిర్యాలగూడ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం తరఫున సన్మానించడం జరిగింది.
ఈ సందర్భంగా విశ్వ బ్రాహ్మణ సంగం రాష్ట్ర కార్యదర్శి గడగొజు చంద్ర శేఖర్, మండల అధ్యక్షుడు ఈశ్వర చారి మాట్లాడుతూ గత కొంతకాలంగా మండల కమిటీ గౌరవ అధ్యక్షునిగా, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ రాష్ట్ర కమిటీ సభ్యులుగా విశ్వబ్రాహ్మణుల సంఘటితం కోసం ఐక్యత కోసం విశ్వబ్రాహ్మణుల అభివృద్ధి కోసం ఆయన పాటుపడుతున్న కృషి అభినందనీయమని అన్నారు.
ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు ఇనుగుర్తి గోవర్ధన చారి, చేర్యాల వెంకటాచారి, కార్పెంటర్ యూనియన్ అసోసియేషన్ అధ్యక్షులు దేవులపల్లి అశోక్ చారి, కార్యదర్శి వెంకటాచారి మండల కమిటీ నాయకులు శ్రీనివాస్ ఆచారికోరేల, మట్టయ్య చారి తదితరులు తదితరులు ఉన్నారు.









