Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజాతరలుజిల్లా వార్తలుతెలంగాణపండుగలుసూర్యాపేట జిల్లా

Suryapet : తెలంగాణ సంప్రదాయానికి ప్రతీక బోనాలు

Suryapet : తెలంగాణ సంప్రదాయానికి ప్రతీక బోనాలు

ప్రత్యేక పూజలు చేసి తొలి బోనం ఎత్తిన మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట , మనసాక్షి

తెలంగాణ సంప్రదాయానికి ప్రతీక బోనాల పండుగ వేడుకలు అని సూర్యాపేట శాసన సభ్యులు , రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తెలిపారు.శ్రీశ్రీశ్రీ ఇంద్రవెల్లి ఊర ముత్యాలమ్మ అమ్మవారిఆశీస్సులు ప్రతీ ఒక్కరికీ కలుగాలని మంత్రి ఆకాంక్షించారు.

సూర్యాపేట లో బోనాల సందడి నెలకొన్నది. తాళ్ళ గడ్డ లో కొలువైన శ్రీశ్రీశ్రీ ఇంద్రవెల్లి ముత్యాలమ్మ అమ్మవారికి భక్తులు బోనాలను సమర్పించారు. కార్యక్రమానికి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని భైరు దుర్గయ్య నివాసం లో తొలి బోనం ఎత్తి అనంతరం ఆలయం లో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.

ALSO READ :

1. Viral Video : వామ్మో ఏం టాలెంట్ రా బాబు.. మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కూడా ఫిదా..!

2. Telangana : కొత్తగా వచ్చిన వారికి టికెట్లు ఇవ్వద్దు.. అభ్యర్థుల ఎంపికపై కోదండ రెడ్డి కీలక సూచనలు..!

3. Chandrayaan3 : జాబిల్లిపై రోవర్ లేటెస్ట్ వీడియో ..ఏం చేసిందో మీరే చూడండి. ! ( వీడియో)

గ్రామదేవతలను తమ ఇంటి ఆడపడుచుగా భావించి పూజించే విశిష్టమైన సంప్రదాయం కేవలం తెలంగాణకే సొంతమన్నారు. బోనాల సమయం లో అమ్మవార్లు తమ పుట్టింటికి వస్తారని ప్రజలు విశ్వసిస్తారని అన్నారు. అమ్మవారి ఆశీస్సుల తో పాటు , ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో గత పాలకుల హయాం లో అభివృద్ధి కి నోచుకోని తాళ్ళగడ్డ ప్రాంతం బాంగారు గడ్డ గా మారిందని అన్నారు.

అదుపు లో ఉన్న శాంతి భద్రతల కు తోడు అభివృద్ధి లో ,వ్యాపారరంగాల్లో సూర్యాపేట దూసుకుపోతుందన్నారు. ప్రజలకు ఆయుర్ ఆరోగ్యాలతో పాటు అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించి పాడి పంటల తో తులతూగేలా చల్లని ఆశీస్సులు అందజేయాలని అమ్మవారిని వేసుకున్నట్లు మంత్రి తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరోసారి దీవించేలా అమ్మవారిని వేడుకున్నట్లు మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు.

కార్యక్రమం లో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గోపగాని వెంకట్ నారాయణ గౌడ్, గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మారిపెద్ధి శ్రీనివాస్ గౌడ్, చిరివెళ్ళ శభరి ,భైరు దుర్గయ్య గౌడ్, బైరు వెంకన్న గౌడ్,రాపర్తి శ్రీనివాస్ గౌడ్, కక్కిరేని నాగయ్య గౌడ్, బూర బాల సైదులు గౌడ్,రాపర్తి శ్రీనివాస్ గౌడ్, అనంతుల యాదగిరి గౌడ్, కటికం శ్రీనివాస్ గౌడ్, కెక్కి రేని సత్యనారాయణ గౌడ్,దేషగాని శ్రీనివాస్ గౌడ్, పల్స వెంకన్న గౌడ్, గోపగాని వేణు గౌడ్, యల్గురి రాంబాబు గౌడ్, కెక్కిరేని ఆనంద్ గౌడ్, మండధి గోవర్ధన్,రాపర్తి రాము తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు