పేదల భూములపై అధికారుల జులుం
పేదల భూములపై అధికారుల జులుం
అఖిల భారత బంజారా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధీరావత్ స్కైలాబ్ నాయక్
మిర్యాలగూడ , మనసాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలోని జంకుతండలో తన భూమిని బలవంతంగా, దౌర్జన్యంగా పోలీసులు లాక్కున్నారని పురుగుల మందు తాగి సోమవారం మహిళ ఆత్మహత్య చేసుకాగా ఆగ్రహించిన గ్రామ ప్రజలు,కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం జడ్చర్ల -కోదాడ జాతీయ రహదారిపై వెంకటాద్రిపాలెం గ్రామం వద్ద రెండు గంటలకు పైగా రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా అఖిల భారత బంజారా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధీరావత్ స్కైలాబ్ నాయక్ మాట్లాడుతూ మండలంలోని జంకుతండ గ్రామపంచాయతీ పరిధిలో సర్వే నెంబర్ 65లో ఉన్న ప్రభుత్వ భూమిని ప్రైవేట్ భూమిగా చూపించి పక్కనున్న సర్వే నెంబర్ కు జోడించి ప్రైవేట్ పట్టా చేయించుకుని గ్రామపంచాయతీ భవనం నిర్మాణానికి పూనుకోవడం తగదన్నారు. పేదల భూములను బలవంతంగా బలవంతంగా లాక్కోవాలనుకోవడం తగదన్నారు.
ALSO READ :
- Lightning strikes : రెండు గంటల్లో 61 వేల పిడుగులు.. 12 మంది మృతి..!
- THUMMALA : తగ్గేదే లే.. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేసి తీరుతా.. తుమ్మల స్పష్టం..!
- Telangana : కొత్తగా వచ్చిన వారికి టికెట్లు ఇవ్వద్దు.. అభ్యర్థుల ఎంపికపై కోదండ రెడ్డి కీలక సూచనలు..!
- Phone Pe Share Market | ఫోన్ పే షేర్ మార్కెట్.. వినియోగదారులకు గుడ్ న్యూస్..!
- Tea : టీ తాగేటప్పుడు ఈ పొరపాట్లు అస్సలు చేయకూడదు.. టీలో అవి కలుపుకొని తింటే..!
- Chandrayaan3 : జాబిల్లిపై రోవర్ లేటెస్ట్ వీడియో ..ఏం చేసిందో మీరే చూడండి. ! ( వీడియో)
కబ్జాలో ఉన్న గ్రామస్తులను , రైతులను,పట్టాదారులను బలవంతంగా పోలీసులు,రెవెన్యూ అధికారులతో అడ్డు తొలగించి ఆక్రమించుకోవాలనుకోవడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ఈ విషయమై ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని విచారణ జరిపించాలని, అక్రమ పట్టా రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఉద్రిక్త పరిస్థితులు, ఆత్మహత్య యత్నం జరుగుతున్న ప్రస్తుత తరుణంలో బలవంతపు ఆక్రమణలు, పోలీసుల దౌర్జన్యాలను నివారించాలని నివారించాలని సూచించారు.40 సంవత్సరాలుగా కబ్జాలో ఉన్న పేదలను బలవంతంగా ఖాళీ చేపిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
కార్యక్రమంలో బి,అర్,ఎస్ నాయకులు అశోక్, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి మేరవత్ విజయ్ నాయక్, హరి చంద్ నాయక్,గుండు, చీనా, రాజేందర్, హీరా, కౌసల్య, రామీ,శారద,రజినీ, సితాలి,పద్మ, తడతరులు ఉన్నారు.అనంతరం సమగ్ర విచారణ,సర్వే చేసిన అనంతరం గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి పూనుకోవాలని కోరుతూ ఆర్డీవో ఎంఆర్ఓ డీఎస్పీలకు వినతిపత్రాలు సమర్పించారు.









