అన్నదాతలకు ఆయిల్ ఫామ్ సాగు పై అవగాహన కల్పించాలి
అన్నదాతలకు ఆయిల్ ఫామ్ సాగు పై అవగాహన కల్పించాలి
జిల్లా కలెక్టర్ కోయా శ్రీహార్ష
నారాయణపేట టౌన్, మన సాక్షి:
దేశ వ్యాప్తంగా మార్కేట్ లో వంటనూనె ధరలు పెరుగుతున్న నేపథ్యంలో అన్నదాతలకు ఆయిల్ పామ్ సాగు పై అవగాహన కల్ఫించాలని జిల్లా కలెక్టర్ కోయా శ్రీహార్ష తెలిపారు. గురువారం ఉదయం సమావేశం మందిరం లో జిల్లా ఉద్యానవన శాఖా అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశం లో వంట నూనెలకు పెరుగుతున్న డిమాండ్ నేపధ్యంలో అన్నదాతలు లకు ఆయిల్ ఫామ్ సాగు పై అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికారులకు ఆదేశించారు.
ALSO READ : WhatsApp : వాట్సాప్ లో డిలీట్ అయినవి తిరిగి పొందవచ్చు.. అందుబాటులో అదిరిపోయే ఫీచర్స్..!
ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో ఆయిల్ఫామ్ సాగు పై రైతు లతో సమీక్ష సమావేశం నిర్వహించాలని రైతులు ఆయిల్ ఫామ్ దిషగా ప్రోత్సహించాలన్నారు. జిల్లా కు కేటాయించిన టార్గెట్ పూర్తి చేయాలన్నారు. ఆయిల్ ఫార్మ్ సాగు కై ముందుకు వచ్చిన రైతు ద్వార మొక్క 20 రూపాయలు చొప్పున కటించుకొని కొన్ని ఆసక్తి గలవారికి అందజేయలన్నారు.
ALSO READ : Mobile Net : మీ మొబైల్ లో నెట్ స్లో అయ్యిందా.. ఈ మార్పులు చేయండి.. రాకెట్ వేగంతో నెట్ స్పీడ్..!
ఈ నలాఖరి వరకు డ్రిప్ సంస్థ కు కేటాయించిన లక్షాన్ని పూర్తి చేయాలన్నారు. ఈ నెల వారికి 2900 ఎకరాల సాగు లక్షంగా పూర్తి చేయాలన్నారు. ఆయిల్ ఫార్మ్ సగువల్ల కలిగే లాభాలను రైతులకు వివరించలన్నారు.
ఈ సమావేశం లో జిల్లా ఉద్యానవన అధికారులు పాల్గొన్నారు.









