కిషన్ రెడ్డి అరెస్టు కు వ్యతిరేకంగా నిరసన
కిషన్ రెడ్డి అరెస్టు కు వ్యతిరేకంగా నిరసన
నారాయణపేట టౌన్, మనసాక్షి:
బీ.జె.పి. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చేపట్టిన 24 గంటల ఉపవాస దీక్షను పోలీసులు దీక్షను భగ్నం చేసి అక్రమంగా అరెస్ట్ చెయడాన్నీ నిరసిస్తూ గురువారం రోజు జిల్లా కేంద్రంలో బీ.ఆర్.ఎస్. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు.
ALSO READ : TS RTC : ఆర్టీసీ బస్సుల్లో డిజిటల్ చెల్లింపులు.. అందుబాటులోకి ఐ – టిమ్స్ యంత్రాలు..!
పట్టణ అధ్యక్షుడు రఘు రామయ్య గౌడ్ మాట్లాడుతూత్య్ర నిధులు, నియమాకాల కోసం 1200 మంది విద్యార్థుల బలిదానం వల్ల ఏర్పడ్డ తెలంగాణ ఒక్క కల్వకుంట్ల కుటుంబం చేతిలో నలిగి పోతుందని తెలంగాణ లో కె.సి.ఆర్.నిరంకుశ పాలను కొనసాగుతుందని, కె.సి.ఆర్.ను గద్దె దింపే రోజులు వచ్చాయని , తెలంగాణ లో బీ.జె.పి. అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవెరుస్తుదని పట్టణ అధ్యక్షుడు చెప్పారు.
ALSO READ : Mobile Net : మీ మొబైల్ లో నెట్ స్లో అయ్యిందా.. ఈ మార్పులు చేయండి.. రాకెట్ వేగంతో నెట్ స్పీడ్..!
ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ సహాయ న్యాయవాది రఘువీర్ యాదవ్, ఓ.బీ.సి. మోర్చా జిల్లా అధ్యక్షుడు మిర్చి వెంకటయ్య, పట్టణంలో కార్యదర్శి రాము, కౌంసిలర్ రమేశ్, కమలాపూర్ శ్రీనివాస్, సైదప్ప, చందూ, తాజుద్దిన్ తదితరులు పాల్గొన్నారు.









