Bjp : తెలంగాణలో డబుల్ ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు.. ప్రధాని నరేంద్ర మోడీ
Bjp : తెలంగాణలో డబుల్ ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు.. ప్రధాని నరేంద్ర మోడీ
కాంగ్రెస్ పంచసూత్రాల పాలన ప్రజలకు అర్థమైంది….
దేశంలో మళ్లీ పాతరోజులు తీసుకురావాలని కాంగ్రెస్ యత్నం….
కేంద్రంలో కాంగ్రెస్ కు అధికారం ఇస్తే మన సంపదపై పన్ను వేస్తారు…
మొన్నటివరకు బిఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణను దోచుకుంటుంది…
కాంగ్రెస్, బిఆర్ఎస్ రెండూ తోడుదొంగలే….
రిజర్వేషన్లు, రాజ్యాంగంపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తుంది…
ఓట్ల కోసమే ముస్లింలకు కాంగ్రెస్ రిజర్వేషన్లు ఇచ్చింది…
అల్లాదుర్గ్ విశాల్ జన సభలో ప్రధాని నరేంద్ర మోడీ
అందోలు, మనసాక్షి :
తెలంగాణలో కాంగ్రెస్ డబుల్ ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తుందని, డబుల్ ఆర్ ట్యాక్స్ వల్ల దేశం సిగ్గుపడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ జిల్లాలోని అల్లాదుర్గంలో బీజేపీ భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.కాంగ్రెస్ అధికారంలో ఉన్నచోట పంచసూత్రాలతో పాలన చేస్తుందని ప్రధాని మోదీ తెలిపారు.
కాంగ్రెస్ పంచసూత్రాలు అంటే అవినీతి, అబద్ధాలు, ఓటు బ్యాంకు రాజకీయాలు, మాఫియా, కుటుంబ రాజకీయాలు అని ఎద్దేవా చేశారు. దేశంలో మళ్లీ పాతరోజులు తీసుకురావాలని కాంగ్రెస్ చూస్తోందని విమర్శించారు. ఈ పంచసూత్రాల పాలన ప్రజలకు అర్థమైందని వారి మాయలో ప్రజలు పడొద్దని హెచ్చరించారు. ఓటమి నైరాశ్యంలో కాంగ్రెస్ నేతలు దిగజారుతున్నారని పీఎం మోదీ విమర్శలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఫేక్ వీడియో సృష్టించారన్నారు. ఆ ఫేక్ వీడియోలను విడుదల చేసేవారిని వదిలిపెట్టమని హెచ్చరించారు. విపక్ష కాంగ్రెస్కు ఈసారి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని, చరిత్రలో ఎన్నడూ రానంత తక్కువ సీట్లు కాంగ్రెస్కు వస్తాయని జోస్యం చెప్పారు.
తెలంగాణ డబుల్ ఆర్ ట్యాక్స్ :
తెలంగాణలో డబుల్ ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ప్రధాని మోదీ విమర్శించారు. డబుల్ ఆర్ ట్యాక్స్ వసూలు చేసి దిల్లీకి కప్పం కడుతున్నారని ధ్వజమెత్తారు. డబుల్ ఆర్ ట్యాక్స్ తక్షణమే ఆపాలని కాంగ్రెస్ కు హెచ్చరించారు. వ్యాపారులు, గుత్తేదార్లు దొడ్డిదారిలో డబుల్ ఆర్ ట్యాక్స్ కడుతున్నారని ఆరోపణలు చేశారు. పొరపాటున కేంద్రంలో కాంగ్రెస్ వస్తే మన సంపదను దోచుకుంటుందని అన్నారు. ఇందులో 55 శాతం కాంగ్రెస్ తీసుకుంటుందని హెచ్చరించారు.
మొన్నటి వరకు తెలంగాణను బీఆర్ఎస్ తెలంగాణను దోచుకుందని, ఇప్పుడు కాంగ్రెస్ దోచుకుంటోందని ప్రధాని మోదీ దుయ్యబట్టారు. కాళేశ్వరం అతిపెద్ద కుంభకోణమని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ కుంభకోణంపై కాంగ్రెస్ మాట్లాడిందని, కానీ ఇప్పుడు అధికారంలోకి రాగానే ఈ స్కామ్ను తొక్కిపెట్టిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ తోడు దొంగలేనని అన్నారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు పరస్పరం సహకరించుకుంటున్నారని తెలిపారు.”రైతులను భగవత్ స్వరూపాలుగా బీజేపీ చూస్తుంది. 100 రోజుల్లో రుణమాఫీ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ మోసం చేసింది. క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తా హామీను కాంగ్రెస్ నెరవేర్చలేదు. బీఆర్ఎస్ పాలకులు ఓటుకు నోటు కేసును తొక్కిపెట్టింది. కాంగ్రెస్, బీఆర్ఎస్వేర్వేరు కాదు. బీజేపీ వల్లే మహిళలకు రక్షణ. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తేనే ప్రజల సంపదకు రక్షణ ఉంటుంది. అయోధ్యలో రామమందిర నిర్మాణం 500 ఏళ్ల భారతీయుల స్వప్నమన్నారు.
ఓట్ల కోసమే ముస్లింలకు రిజర్వేషన్లు :
2004-09లో ఉమ్మడి ఏపీలో అత్యధికంగా కాంగ్రెస్ ఎంపీలను గెలిపించారు. కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల హక్కులను కాలరాసిందని, ఓట్ల కోసమే ముస్లింలకు కాంగ్రెస్ రిజర్వేషన్లు ఇచ్చిందన్నారు.ముస్లిం రిజర్వేషన్లకు కాంగ్రెస్ అనుకూలమన్నారు. లింగాయత్ల రిజర్వేషన్లకు వ్యతిరేకమన్నారు.
రిజర్వేషన్లు, రాజ్యాంగంపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. మాదిగలకు అండగా ఉంటాను. ఎస్సీ వర్గీకరణకు నేను అనుకూలమన్నారు.రాజ్యాంగంపై, అంబేడ్కర్ పై కాంగ్రెస్ కు గౌరవం లేదని, తొలి ప్రధాని నెహ్రూ రాజ్యాంగాన్ని అవహేళన చేశారన్నారు. రాజకీయ అవసరాల కోసం ఇందిరా రాజ్యాంగానికి తూట్లు పొడిచారని’ ప్రధాని మోదీ అన్నారు.
రాజ్యాంగం పవిత్ర గ్రంథం
రాజ్యాంగం అంటే పవిత్ర గ్రంథంగా భావిస్తాం. రాజ్యాంగం రచించి 60 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా ఊరేగింపు చేశాను. గుజరాత్ సీఎం ఉన్నప్పుడు ఏనుగుపై రాజ్యాంగాన్ని పెట్టి ఊరేగించి రాజ్యాంగం పట్ల నాకున్న గౌరవంపై మీరు శంకించాల్సినఅవసరం లేదన్నారు.పార్లమెంటులోకి అడుగుపెట్టేముందు రాజ్యాంగానికి, పార్లమెంటుకు నమస్కారం చేశానన్నారు.కాంగ్రెస్ దేశ రాజ్యాంగాన్ని, పార్టీ రాజ్యాంగాన్ని హేళన చేసి దేశాన్ని పాలించడం జన్మహక్కు అని కాంగ్రెస్ భావిస్తోందన్నారు. కాంగ్రెస్ గెలవకుంటే ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తుందని నేతి బతికున్నంత వరకు రాజ్యాంగాన్ని కదిలించే వ్యక్తి, శక్తి లేదని, అధికార దాహంతో రాజ్యాంగాన్ని కాంగ్రెస్ కించపరిచిందని’ పీఎం మోదీ స్పష్టం చేశారు.
అయోధ్యలో రామమందిర నిర్మాణం 500 ఏళ్ల భారతీయుల స్వప్నం. అయోధ్యలో రామమందిరం నిర్మాణం మోదీ వల్ల కాదు, మీ ఓటు వల్లే సాధ్యం అయింది. ప్రభుత్వం పటిష్టంగా ఉంటే కొత్త చరిత్రను ఎలా సృష్టిస్తామో మీరు చూశారు. హైదరాబాద్లో పండుగలు జరుపుకోవాలంటే ఎన్నో ఆంక్షలు ఉన్నాయి. ఓ వర్గం ఓట్ల కోసమే హైదరాబాద్లో పండుగలపై ఆంక్షలు విధించారు. మీరు వేసే ఒక్కొక్క ఓటు మీ కలలు సాకారం కోసం వినియోగిస్తానన్నారు.
తెలుగులో మోదీ ప్రసంగం ప్రారంభం.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన ప్రసంగాన్ని
తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు అంటూ తెలుగులో మోడీ స్పీచ్ ప్రారంచించారు. బసమేశ్వర్, సంగమేశ్వర్, సేవాలాల్ మహరాజ్కు నా నమస్కారాలు తెలుపడంతో ప్రజలు ఒక్కసారిగా అరుపులు కేకలు వేస్తూ మోడీకి మద్దతు పలికారు. సభా ప్రాంగణం అరుపులు కేకలు, చప్పుళ్లతో సభ దద్దరిల్లింది.
ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్, కాంగ్రేస్ భాగస్వాములే :
బీఆర్ఎస్, కాంగ్రేస్ పార్టీలు తోడు దొంగలని, ఢిల్లీలో జరిగిన లిక్కర్ రాకేట్లో కూడా భాగస్వాములేనని ప్రధాని ఆరోపించారు. ఇండియా కూటమిలో భాగస్వామిౖయెన ఢిల్లీ పార్టీ ఆ స్కాంలో భాద్యులైనప్పుడు వీరిద్దరూ ఒక్కటి ఎలా కాదని అన్నారు. అధికారంలోకి రాకముందు కాళేశ్వరంలో అవినీతి జరిగినట్లు ఒంటి కాలిమీద లేచిన కాంగ్రేస్ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టిన తర్వాత విచారణ ఫైళ్లను తొక్కిపెట్టిందని ఆరోపించారు. బీఆర్ఎస్ పదేళ్లు రాష్టాన్ని నాశనం చేస్తే ఇప్పుడు కాంగ్రేస్ నాశనం చేస్తుందని మోదీ అన్నారు.
జహీరాబాద్, మెదక్ లోకసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు బీబీ పాటిల్, రఘునందన్రావులను గెలిపించాలని మోదీ విజ్ఞప్తి చేసారు. కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మన్, జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, జహీరాబాద్, మెదక్ ఎంపీ అభ్యర్థులు బీబీపాటిల్, రఘునందన్రావు, రాష్ట్ర జిల్లా నాయకులు పాల్గొన్నారు.










