పంచాయతీ కార్యాలయంలో కార్యదర్శి నిర్బంధం..!
పంచాయతీ కార్యాలయంలో కార్యదర్శి నిర్బంధం..!
దమ్మపేట, మన సాక్షి :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం లచ్చాపురం గ్రామంలో రాచరుపల్లి పంచాయితీ సెక్రెటరీ ను పంచాయతీ కార్యాలయంలో కొందరు వ్యక్తులు మంగళవారం నిర్బంధించారు. దీంతో ఇద్దరు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఎస్సై సాయి కిషోర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం దమ్మపేట మండలం రాచురపల్లి పంచాయతీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న కార్యదర్శి రవిను తాళ్ళ సురేష్, గిద్దా సాయి అనే వ్యక్తులు వీధుల్లో ఉన్న పంచాయతీ సెక్రెటరీకు విధులకు ఆటంకం కలిగించి గ్రామంలో పారిశుద్ధ్య పనులు, వీధిలైట్లు, దోమల మందు ఫోగింగ్ పనులు చేయడం లేదని ప్రశ్నించి అనంతరం సెక్రెటరీలో పంచాయతీ ఆఫీసులో నిర్బంధించారు.
దీంతో గ్రామస్తులు సహకారంతో బయటకు వచ్చిన పంచాయతీ సెక్రటరీ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ విధులకు ఆటంకం కలిగించారని పోలీస్ స్టేషన్లో తాళ్ళ సురేష్, గిద్దా సాయి లపై ఫిర్యాదు చేయడంతో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సాయి కిషోర్ రెడ్డి తెలిపారు.
LATEST UPDATE :
రైతు భరోసా ఇచ్చే ఉద్దేశ్యం ఉందా.. రుణమాఫీ లెక్కనేనా.!
పదవి లేకున్నా సేవా దృక్పథం.. సొంత డబ్బులతో రోడ్లకు మరమ్మతులు..!
Lion : సీసీ పూటేజీలో సింహం కనిపించింది.. భయాందోళనలో ప్రజలు.. (వీడియో)









