Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణసంగారెడ్డి జిల్లా

TG News : చెరువులోనే మూడంతస్తుల భవనం.. బాంబులతో పేల్చివేసిన అధికారులు.. (వీడియో)

TG News : చెరువులోనే మూడంతస్తుల భవనం.. బాంబులతో పేల్చివేసిన అధికారులు.. (వీడియో)

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ ప్రభుత్వం చెరువుల ఆక్రమణ పై సీరియస్ గా వ్యవహరిస్తుంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో హైడ్రా ద్వారా బఫర్ జోన్, ఎఫ్ టి ఎల్ భూముల్లో ఉన్న భవనాలను తొలగిస్తుంది. దాంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా కూడా పలు ప్రాంతాలలో చెరువుల ఆక్రమణ పై వస్తున్న ఫిర్యాదుల పట్ల అధికారులు వెంటనే స్పందిస్తున్నారు.

కాగా సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ పెద్ద చెరువు సమీపంలో ఓ వ్యక్తి చెరువులోనే మూడంతస్తుల భవనాన్ని నిర్మించాడు. చెరువులో నీరు ప్రస్తుతం భవనం పైకి కూడా వస్తుంది. గ్రామస్తుల ఫిర్యాదుతో రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. FTL భూభాగంలోనే భవనాన్ని నిర్మించినట్లుగా రెవెన్యూ అధికారులు గుర్తించారు. దాంతో హైడ్రా తరహాలో ఈ భవనాన్ని బాంబులతో పేల్చివేశారు.

బాంబులతో పేల్చిన దృశ్యం (వీడియో)

క్లిక్ చేసి ఇది కూడా చదవండి : 

మరిన్ని వార్తలు