Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

ట్రాక్టర్ పైనుంచి పడి మహిళ మృతి..!

ట్రాక్టర్ పైనుంచి పడి మహిళ మృతి..!

మాడుగులపల్లి, మన సాక్షి:

నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలంలోని కల్వల పాలెం వద్ద ట్రాక్టర్ పైనుంచి పడి మహిళ మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పాములపాడు గ్రామానికి చెందిన వరి నాటు కూలీలు సుందర్ నగర్ వద్ద కాంపల్లి మైసమ్మ గుడి దగ్గర మొక్కు తీర్చుకొని తిరిగి తమ స్వగ్రామం పాములపాడు వెళ్తున్నారు.

గురువారం రాత్రి సమయంలో కల్వల పాలెం వద్ద ట్రాక్టర్ డ్రైవర్ సడెన్ బ్రేకు వేయడంతో ముందు కూర్చున్న దొంతగాని శైలజ(31)పై నుంచి కిందపడి అక్కడికక్కడే మృతి చెందగా మరో మహిళ శశగానీ నాగమ్మ కు తీవ్ర గాయాలు అయ్యాయి. పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతురాలికి ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు