Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Madgulapalli : గడ్డి మందు తాగి వృద్ధుడి మృతి..!

Madgulapalli : గడ్డి మందు తాగి వృద్ధుడి మృతి..!

మాడుగులపల్లి, మన సాక్షి:

గడ్డి మందు తాగి వృద్ధుడి మృతి చెందిన సంఘటన మండలంలోని కన్నేకల్ గ్రామంలోని చోటు చేసుకుంది. మాడుగులపల్లి ఎస్సై కృష్ణయ్య తెలిపిన వివరాల ప్రకారం… జొన్నలగడ్డ వెంకటరామ్ రెడ్డి (85) ఇటీవల తన భార్య రాములమ్మ చనిపోయి రెండు సంవత్సరాల నుండి ఒంటరిగా జీవిస్తున్నాడు. మోకాళ్ళ నొప్పి భరించలేక తన ఇంట్లో గడ్డి మందు తాగాడు.

వెంటనే అతని పెదనాన్న కొడుకు జొన్నలగడ్డ బంగారు రెడ్డి నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందాడు. మృతుని కూతురు జూలకంటి లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

MOST READ : 

  1. District SP : ముగిసిన ఆపరేషన్ స్మైల్.. ఎస్పీ సన్ ప్రీత్ సింగ్..!

  2. Rythu Bharosa : రైతు భరోసా డబ్బులు ఖాతాలలో జమ.. ముందుగా వారికే.. బిగ్ అప్డేట్..!

  3. Ration Cards : కొత్త రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. వారికి బియ్యం ఎప్పటినుంచంటే..!

  4. Indiramma Atmiya Bharosa : ఇందిరమ్మ ఆత్మీయ భరోసా డబ్బులు ఎప్పటినుంచంటే.. లేటెస్ట్ అప్డేట్..!

మరిన్ని వార్తలు