క్రైంBreaking Newsజిల్లా వార్తలునల్గొండ
Miryalaguda : ఆర్ఎస్ గోదాం వద్ద ప్రమాదం.. ఒకరు మృతి..!
Miryalaguda : ఆర్ఎస్ గోదాం వద్ద ప్రమాదం.. ఒకరు మృతి..!
మన సాక్షి, మిర్యాలగూడ :
నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెంలోని ఆర్ఎస్ గోదాం వద్ద ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా మరో వ్యక్తికి గాయాలయ్యాయి. రూరల్ పోలీస్ లు తెలిపిన వివరాల ప్రకారం..
వెంకటాద్రిపాలెంలోని ఆర్ఎస్ గోదాంలో పనిచేస్తున్న సమయంలో బుధవారం మధ్యాహ్నం సమయంలో క్రికెట్ ఆడటానికి ఇద్దరు కాంపౌండ్ గోడ దూకడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో ఒకరు గోడ పైకి ఎక్కి చెట్టును పట్టుకున్నాడు.
చెట్టు పై భాగంలో 33/11kv విద్యుత్ సరఫరా జరగడం వలన ఆ చెట్టు కండక్టర్ కేబుల్ కు తగిలి షాక్ తో చింతపల్లి పవన్ కళ్యాణ్ (19) అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా పూజ దుర్గ (21) గాయాలయ్యాయి. గాయాలైన వ్యక్తిని మెరుగని చికిత్స కోసం నల్లగొండ ఆసుపత్రికి తరలించారు. హమాలి కృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
MOST READ :
-
UPI : ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా.. యూపీఐ లావాదేవీలకు కేంద్రం గుడ్ న్యూస్..!
-
WhatsApp : మీ వాట్సాప్ అకౌంట్ హ్యాక్.. ఎలా చేస్తారంటే.. బిగ్ అలర్ట్..!
-
TG News : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. రేషన్ కార్డుదారులకు శుభవార్త..!
-
Telangana Budget 2025 : తెలంగాణ బడ్జెట్ లో సామాన్యులకు భారీ గుడ్ న్యూస్..!
-
Rythu Bharosa : రైతు భరోసా పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన.. బిగ్ అప్డేట్..!









