Women Entrepreneurs : ఆర్థికంలో అదరగొడుతున్న మహిళలు.. పొదును నుంచి పెట్టుబడుల వరకూ వారే..!
Women Entrepreneurs : ఆర్థికంలో అదరగొడుతున్న మహిళలు.. పొదును నుంచి పెట్టుబడుల వరకూ వారే..!
మన సాక్షి:
భారతదేశంలో మహిళల ఆర్థిక అవగాహన గణనీయంగా పెరిగింది. మహిళలు పొదుపు నుంచి పెట్టుబడుల వైపు అడుగులు వేస్తున్నారు. మ్యూచువల్ ఫండ్స్, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ (SIPs) వంటి పెట్టుబడి పథకాల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతోంది.
అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (AMFI), ప్రముఖ కేపిటల్ మార్కెట్ కంపెనీ క్రిసిల్ సంయుక్తంగా విడుదల చేసిన నివేదిక ప్రకారం..
ఈ మార్పుకు ప్రధాన కారణాలు:
పెరుగుతున్న ఉద్యోగ అవకాశాలు, డిజిటల్, ఆర్థిక, సాంకేతికత, ఆర్థిక లక్ష్యాలు.
నివేదికలోని ముఖ్య అంశాలు:
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆర్థిక చేరిక సూచిక (FI-Index) 2023 మార్చిలో 57.9 నుంచి 2024 మార్చిలో 64.2కి పెరిగింది. ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (PMJDY) కింద ఉన్న 53.13 కోట్ల ఖాతాల్లో 29.56 కోట్లు మహిళలవే. 2017-18లో ఉద్యోగం, ఉపాధి ఉన్న మహిళల సంఖ్య 32.3%గా ఉంటే 2023-24 నాటికి 41.7%కి చేరింది.
2014 నుంచి 2021 వరకు డిజిటల్ చెల్లింపు మాధ్యమాలను ఉపయోగించే మహిళల సంఖ్య 14% నుంచి 28%కి పెరిగింది. గడచిన ఐదేళ్లలో మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టే మహిళల సంఖ్య సంవత్సరానికి 20% (CAGR) వృద్ధి చెందింది. కొత్త మ్యూచువల్ ఫండ్ ఫోలియోల్లో సుమారు 25% మహిళలదే. గత ఏడాది నమోదైన SIPలలో దాదాపు 40% మహిళలవే.
2030 నాటికి మ్యూచువల్ ఫండ్ ఆస్తుల నిర్వహణ (AUM)లో మహిళల వాటా 30%కి చేరవచ్చని AMFI-Crisil అంచనా వేసింది. మహిళల ఆర్థిక అవగాహన, పెట్టుబడి సంబంధిత కార్యక్రమాలు మహిళలు స్వతంత్రంగా ఆర్థిక నిర్ణయాలు తీసుకునేందుకు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అధిక ఆదాయం, డిజిటల్ అవలంబన, నిర్మాణాత్మక పెట్టుబడి ఎంపికలతో మహిళలు భారతదేశ ఆర్థిక వ్యవస్థలో మరింత పెద్ద పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉన్నారు.
MOST READ :
-
Health : ఎండు చేపలా, పచ్చివా.. ఆరోగ్యానికి ఏవి మంచివి, గుండె జబ్బు వారికి..!
-
Solar Project: అతిపెద్ద సోలార్ ప్రాజెక్టు అభివృద్ధిలో ముందడుగు..!
-
Bank News: యాక్సిస్ బ్యాంక్ వినియోగదారులకు అలర్ట్.. బ్యాక్ టు బ్యాక్ సేవలకు రెడీ..!
-
Health : మెదడు చురుగ్గా ఉండాలా.. అయితే ఇలా చేయండి..!
-
Pumpkin seeds : గుమ్మడి గింజలు తింటున్నారా.. అయితే ఇది తెలుసుకోండి.. లేదంటే డేంజరే..!









