క్రైంBreaking Newsజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా
ACB : లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై.. లంచం ఎంతో తెలుసా..!

ACB : లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై.. లంచం ఎంతో తెలుసా..!
మన సాక్షి, సూర్యాపేట :
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండల ఎస్సై. వివరాల ప్రకారం.. ఓ వ్యక్తి నుంచి పదివేల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చింతలపాలెం ఎస్సై అంతిరెడ్డి పట్టుపడ్డాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లాకు చెందిన వార్ల వెంకట్రావు గతంలో చింతలపాలెం లో పిడిఎస్ బియ్యం కొనుగోలు చేస్తూ పట్టుబడ్డాడు.
అయితే ఈ కేసు చివరి దశకు వచ్చింది. ఈ కేసును కొట్టివేయాలంటే 15 వేల రూపాయలు ఇవ్వాలని ఎస్ఐ డిమాండ్ చేశారు. దాంతో వెంకటరావు పదివేల రూపాయలు ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. ఆ తర్వాత నల్లగొండ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. అయితే మంగళవారం పోలీస్ స్టేషన్ సమీపంలో చర్చి వద్ద పదివేల రూపాయల నగదు తీసుకుంటుండగా ఏసీబి అధికారులు ఎస్సై ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
MOST READ :
-
Miryalaguda : మున్సిపల్ కార్మికులకు తోడుగా ఉంటా.. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి..!
-
Hyderabad : లారీ బీభత్సం.. ట్రాఫిక్ పోలీసుల పైకి దూసుకెళ్లిన లారీ, ఒకరి మృతి..!
-
Health Report: పెరుగుతున్న బీపీ, షుగర్ బాధితులు..!
-
Miryalaguda : అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీ పట్టివేత..!
-
Axis Bank: యాక్సిస్ బ్యాంక్ వినియోగదారులకు అలర్ట్.. ఓటీపీ మోసాలకు ఇక చెక్..!









