Darna : మా భూముల జోలికి రావద్దు.. గిరిజన రైతుల ధర్నా..!
Darna : మా భూముల జోలికి రావద్దు.. గిరిజన రైతుల ధర్నా..!
దేవరకొండ, మనసాక్షి :
మా భూముల జోలికి రావొద్దు అంటూ మంగళవారం నల్గొండ జిల్లా దేవరకొండ ఆర్డిఓ ఆఫీస్ వద్ధ కొండమల్లేపల్లి మండలం జానీగాని తండా, దేవరోనితండా రైతులు ధర్నా నిర్వహించడం జరిగింది.
కొండమల్లేపల్లి మండలం పెండ్లిపాకల రిజర్వాయర్ లో భూములు కోల్పోయిన పెండ్లిపాకల, గుడితండ గ్రామస్థులకు మండల పరిధిలోని దేవరకొండ జానీగానీ తండా గ్రామాలలో రిహాబిటేషన్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు గాను ప్రభుత్వం చేస్తున్న సర్వే నిలిపివేయాలని రెండు తండాలకు చెందిన రైతులు మంగళవారం దేవరకొండలో ఆందోళన చేపట్టారు.
పెండ్లిపాకుల రిజర్వాయర్లో భూములు కోల్పోతున్న ఆయా గ్రామాల భూ నిర్వాసితులకు వారి గ్రామాల్లోనే భూములు కేటాయించాలని డిమాండ్ చేస్తూ దేవరకొండ ఆర్డిఓ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. అంబేద్కర్ విగ్రహానికి దండ వేసి దేవరకొండ బస్టాండ్ ఎదుట రాస్తారోకో చూపెట్టారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.
MOST READ :
-
WhatsApp : వాట్సప్ యూజర్లే నేరగాళ్ల టార్గెట్.. అప్రమత్తం లేకుంటే మీ ఎకౌంటు ఖాళీ.. ఆ బ్యాంక్ సలహాలు..!
-
CM Revanth Reddy : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..!
-
Gold Price : మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఈరోజు తులం ఎంతంటే..!
-
Tea : టీ తో బిస్కెట్ కలిపి తింటున్నారా.. అయితే ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిందే..!









