క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణ
Miryalaguda : శబరిష హోటల్ పై పోలీసుల తనిఖీలు.. మద్యం బాటిళ్లు పట్టివేత..!
Miryalaguda : శబరిష హోటల్ పై పోలీసుల తనిఖీలు.. మద్యం బాటిళ్లు పట్టివేత..!
మన సాక్షి, మిర్యాలగూడ :
నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని హోటల్ పై రూరల్ పోలీసులు దాడులు నిర్వహించి తనిఖీలు చేశారు. అక్రమంగా నిల్వ ఉన్న మద్యం బాటిలను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
మిర్యాలగూడ పట్టణంలోని రవీంద్ర నగర్ కాలనీలో రైల్వే స్టేషన్ రోడ్డు పక్కన ఉన్న శబరిష హోటల్, టిఫిన్ సెంటర్ వద్ద హోటల్ యజమాని అక్రమంగా బీర్లు విస్కీ అమ్ముతున్నారనే సమాచారంతో తనిఖీలు నిర్వహించారు.
కాగా హోటల్లో సుమారుగా 31 లీటర్ల వివిధ రకాల మద్యం, 28 లీటర్ల వివిధ రకాల విస్కీ బాటిల్ ఉన్నట్లుగా గుర్తించారు. మద్యం బాటిళ్లను సీజ్ చేసిన పోలీసులు హోటల్ యజమాని బాణాల శ్రీనివాస్ రెడ్డి పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
MOST READ :
-
TG News : తెలంగాణలో మరో కొత్త పథకం.. వారి ఖాతాలలో రూ.6 వేలు..
-
Nalgonda : సివిల్ సప్లై కార్యాలయంలో ఏసీబీ సోదాలు.. మిర్యాలగూడ డిటి జావిద్ అరెస్ట్..!
-
Srisailam : శ్రీశైలం కు భారీగా వరద పోటు.. గేట్లు ఎత్తేందుకు సిద్ధమైన అధికారులు.. లేటెస్ట్ అప్డేట్..!
-
CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన.. వారికి 60 సీట్లు ఇస్తా, గెలిపిస్తా..!
-
TG News : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. వారికి భారీ గుడ్ న్యూస్..!









