క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనిజామాబాద్

Nizamabad : నిజామాబాద్ జిల్లాలో విషాదం.. ఐదు నెలల చిన్నారిని హత్య చేసిన తల్లి..!

Nizamabad : నిజామాబాద్ జిల్లాలో విషాదం.. ఐదు నెలల చిన్నారిని హత్య చేసిన తల్లి..!

భీంగల్, మన సాక్షి :

ఐదు నెలల కూతురును తన భార్య హత్య చేసినట్లు భీంగల్ మండలంలోని గోన్ గొప్పుల గ్రామానికి చెందిన గంగోని మల్లేష్ ఫిర్యాదు చేసినట్లు స్థానిక ఎస్సై సందీప్ తెలిపారు. ఆయన వివరాల తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన గంగోని మల్లేష్, సిరసు రమ్య బార్యభర్తలు. వీరికి 5 నెలల కూతురు చిన్నారి శివానీ ఉంది. అయితే వీరు గుల్ఫారం కల్లుకు బానిసలుగా మారారు.

ఈ నేపథ్యంలో మల్లేష్ భార్య రమ్య తన కూతురును పట్టించుకోవడంలేదని ఆదివారం మందలించాడు. దీంతో కూతురు కారణంగా సంసారంలో గొడవలు జరుగుతున్నాయని భావించి, తండ్రి బయటకు వెళ్లిన సమయం చూసి శివానీని హత్య చేసినట్లు తండ్రి మల్లేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్, ఇంచార్జి సీఐ శ్రీధర్ రెడ్డి విచారణ జరిపారు.

ఈ వార్తలు కూడా చదవండి

  1. USA : అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ కుటుంబం సజీవ దహనం..!

  2. TG News : తెలంగాణలో మరో కొత్త పథకం.. వారి ఖాతాలలో రూ.6 వేలు..

  3. TG News : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. వారికి భారీ గుడ్ న్యూస్..!

  4. CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన.. వారికి 60 సీట్లు ఇస్తా, గెలిపిస్తా..!

మరిన్ని వార్తలు