Nalgonda : నల్గొండ జిల్లాలో పోలీస్ స్టేషన్ కు చేరిన కోడి పంచాయితీ.. సోషల్ మీడియాలో వైరల్..!
Nalgonda : నల్గొండ జిల్లాలో పోలీస్ స్టేషన్ కు చేరిన కోడి పంచాయితీ.. సోషల్ మీడియాలో వైరల్..!
మన సాక్షి, నల్గొండ ప్రతినిధి :
నల్గొండ జిల్లాలో కోడి పంచాయితీ పోలీస్ స్టేషన్ కు చేరింది. తన కోడి కాలు విరగొట్టాడంటూ వృద్ధురాలు నకిరేకల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
నల్లగొండ జిల్లా.. నకిరేకల్ మండలం గొల్లగూడెంకు చెందిన గంగమ్మ అనే వృద్ధురాలికి పెంపుడు కోడి ఉంది. గంగమ్మ ఇంటి పక్కనే ఉన్న రాకేష్ ఇంట్లోని గేదెల వద్ద గడ్డి లో గింజలు తినేది. అయితే తన గేదెల వద్ద గడ్డి తొవ్వుతున్న గంగమ్మ కోడిని ఆగ్రహంతో రాకేష్ కర్రతో కొట్టడంతో కోడి కాళ్లు విరిగిపోయాయి. తన కోడి కాళ్లు విరగొట్టిన రాకేష్ ప్తె కేసు నమోదు చేయాలంటూ గంగమ్మ బోరున విలపిస్తూ *రాత్రి* నకిరేకల్ .పోలీసులకు ఫిర్యాదు చేసింది.
నా కళ్ళముందే కోడిని కర్రతో కొట్టి కాళ్లు విరగొట్టాడని. నాకు డబ్బులు వద్దు ఏమి వద్దు రాకేష్ కు శిక్ష పడాల్సిందేనంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
గ్రామానికి వచ్చి పంచాయతీని పరిష్కరిస్తామని సర్ది చెప్పారు. ప్రస్తుతానికి ఇంటికి వెళ్లి కోడికి వైద్యం చేయించుకోమని చెప్పి గంగమ్మను ఇంటికి పంపించేశారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పోలీస్ స్టేషన్లో కోడి పంచాయితీ
కోడిని కొట్టాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ
నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణంలోని గొల్లగూడెంలో తన గడ్డివాములో గింజలు తింటుందని, కర్రతో కొట్టి కోడి కాళ్లు విరగగొట్టిన రాకేష్ అనే వ్యక్తి
దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన గంగమ్మ
పోలీసులు సర్దిచెప్పే… pic.twitter.com/I9MssgNZbh
— Telugu Scribe (@TeluguScribe) July 10, 2025









