Breaking Newsఆంధ్రప్రదేశ్క్రైం

Crime News : ఇద్దరు కొడుకులను చంపి.. తండ్రి ఆత్మహత్య..!

Crime News : ఇద్దరు కొడుకులను చంపి.. తండ్రి ఆత్మహత్య..!

మన సాక్షి :

ఇద్దరు కొడుకులను చంపి తండ్రి ఆత్మహత్య చేసుకున్న విషాదకర సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా నరసరావుపేట బావపేట కాలనీలో నివాసం ఉంటున్న యూసుఫ్ ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నాడు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తాయి.

దాంతో అతడు తన ఇద్దరు కుమారులు హుస్సేన్, ఆరిఫ్ లను తీసుకొని గుంటూరులోని సాయిబాబా కాలనీలో నివాసం ఉంటున్న తన సోదరి వద్దకు వచ్చాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో కొడుకులకు ఎలుకల మందు ఆహారంలో పెట్టి వారు చనిపోయిన తర్వాత అతడు కూడా ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

MOST READ :

  1. Nagarjunasagar : నాగర్జున సాగర్ కు భారీగా పర్యాటకులు.. 22 క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదల..!

  2. Big Alert : తెలంగాణకు భారీ వర్ష సూచన.. నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్..!

  3. TG News : ఆ ఉద్యోగులే లక్ష్యంగా ఘరానా మోసం.. రూ.20 కోట్ల దోపిడి..!

  4. SBI : ఎస్బిఐ అదిరిపోయే ఆఫర్.. వారికి పూచికత్తు లేకుండా రూ.4 లక్షల రుణం..!

మరిన్ని వార్తలు