Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనిజామాబాద్
కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు..!
కన్నతల్లి నీ కడ తేర్చిన కసాయి కొడుకు ఈ ఘటన నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో చోటుచేసుకుంది.

కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు..!
కన్నతల్లి నీ కడ తేర్చిన కసాయి కొడుకు ఈ ఘటన నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో చోటుచేసుకుంది.
ఎస్సై సునీల్ తెలిపిన వివరాల ప్రకారం భూమవ్వ (70) పెన్షన్ డబ్బులు ఇవ్వమని, ఇల్లు అమ్మేద్దామని తరాచు గొడవపడేవాడని అందుకు ఒప్పుకోలేక, కన్నకొడుకే కాలయముడై శుక్రవారం రాత్రి ఖాళీ సీసాతో తల మీద కొట్టి, మరియు రోకలి కర్రతో రెండు మూడు సార్లు తలపై కొట్టగా ఆమె చనిపోయింది.
తర్వాత ఎవరు లేని సమయంలో మధ్య రాత్రి ఆమె కుమారుడు మానాజీ మళ్లీ తల దగ్గర పెట్టిన దీపం నూనెను ఆమె ఒంటిమీద పోసి నిప్పంటించగా ఆమె మెడ భాగం దగ్గర కొద్దిగా మరి రెండు కాళ్లు మోకాలు వరకు కాలిపోయింది అని ఆమె భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
– కోటగిరి, మన సాక్షి:









