Breaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండ

Breaking : తీవ్ర విషాదం.. సాగర్ ఎడమ కాలువలో వ్యక్తి గల్లంతు..!

Breaking : తీవ్ర విషాదం.. సాగర్ ఎడమ కాలువలో వ్యక్తి గల్లంతు..!

మిర్యాలగూడ, మన సాక్షి:

నాగార్జునసాగర్ ఎడమ కాలువలో వ్యక్తి గల్లంతయిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. మండలంలోని తడకమళ్ళ గ్రామ శివారులోని తలుపుల సమీపంలో సాగర్ ఎడమ కాలువలో ఇద్దరి యువకులు కలిసి స్నానం చేస్తుండగా ప్రమాదశాత్తు ఒక వ్యక్తి గల్లంతయ్యాడు.

మరో ఇద్దరు యువకులు కొట్టుకుపోతుండగా స్థానికులు కాపాడారు. గల్లంతయిన వ్యక్తి వేములపల్లి మండలంలోని రావులపెంట గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. గాలింపు చేపట్టారు. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

By : Vinay, Miryalaguda 

మరిన్ని వార్తలు