Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలునల్గొండ
నూతన ఏఈఓగా మాలోతు ప్రియాంక బాధ్యతల స్వీకరణ..!
వేములపల్లి మండలంలోని రావులపెంట, లక్ష్మీదేవిగూడెం, ఆమనగల్లు గ్రామాలకు నూతన వ్యవసాయ విస్తరణ అధికారిగా (ఏ.ఈ.ఓ) మాలోతు ప్రియాంక బాధ్యతలు స్వీకరించారు.

నూతన ఏఈఓగా మాలోతు ప్రియాంక బాధ్యతల స్వీకరణ..!
వేములపల్లి, మనసాక్షి :
వేములపల్లి మండలంలోని రావులపెంట, లక్ష్మీదేవిగూడెం, ఆమనగల్లు గ్రామాలకు నూతన వ్యవసాయ విస్తరణ అధికారిగా (ఏ.ఈ.ఓ) మాలోతు ప్రియాంక బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పని చేసిన గోలి మల్సూర్ ఏవోగా ప్రమోషన్ రావడంతో.. ఆయన స్థానంలో ఇన్చార్జి ఏఈఓగా కృష్ణ పని చేశారు.
దామరచర్ల మండలం వీర్లపాలెంలో ఏఈఓగా విధులు నిర్వహిస్తున్న ప్రియాంక.. ఇటీవల బదిలీ పై వచ్చారు. ఈ ఆమె సందర్భంగా మాట్లాడుతూ… రైతులకు నిరంతరం అందుబాటులో ఉంటానన్నారు. ప్రతి రైతు ఫార్మా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు.అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు లబ్ధి పొందాలంటే ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అన్నారు.









