Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా
ACB : సూర్యాపేటలో ఏసీబీ దాడులు.. రూ.20 వేలు లంచం తీసుకుంటూ దొరికిన అధికారి..!
సూర్యాపేట జిల్లా భూగర్భ జలశాఖలో ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేశారు.

ACB : సూర్యాపేటలో ఏసీబీ దాడులు.. రూ.20 వేలు లంచం తీసుకుంటూ దొరికిన అధికారి..!
సూర్యాపేట, మనసాక్షి :
సూర్యాపేట జిల్లా భూగర్భ జలశాఖలో ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేశారు. బోరు రిగ్గింగ్ అనుమతి కోసం రూ. 20 వేలు లంచం తీసుకుంటూ జిల్లా భూగర్భ జల అధికారి మెగావత్ బాలు, డేటా ఎంట్రీ ఆపరేటర్ కొసరాజు వెంకటేశ్వర్లు ఏసీబీకి చిక్కారు. నిందితులను అరెస్ట్ చేసిన అధికారులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నిందితులను లను జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం నాంపల్లిలోని స్పెషల్ & ఏసీబీ కేసుల అదనపు ప్రత్యేక న్యాయమూర్తి ముందు హాజరుపరుస్తున్నారు. ఈ కేసు దర్యాప్తులో ఉంది. భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారు వివరాలు గోప్యంగా ఉంచబడ్డాయని తెలిపారు.









