వాహనదారులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన CNG ధర..!
దేశ రాజధాని ఢిల్లీలో వాహనదారులపై మరోసారి ఇంధన భారం పడింది. ఢిల్లీ తోపాటు పరిసర ప్రాంతాల్లో CNG (లిక్విడ్ఫైడ్ నేచురల్ గ్యాస్) ధర కిలోకి 3.89 రూపాయల చొప్పున పెరిగింది.

వాహనదారులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన CNG ధర..!
మన సాక్షి, వెబ్ డెస్క్:
దేశ రాజధాని ఢిల్లీలో వాహనదారులపై మరోసారి ఇంధన భారం పడింది. ఢిల్లీ తోపాటు పరిసర ప్రాంతాల్లో CNG (లిక్విడ్ఫైడ్ నేచురల్ గ్యాస్) ధర కిలోకి 3.89 రూపాయల చొప్పున పెరిగింది. ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ శుక్రవారం రాత్రి ధరలు పెరగనున్నట్లు ప్రకటించింది. అయితే పెరిగిన ధర శనివారం ఉదయం నుంచి అమల్లోకి వచ్చింది.
ALSO READ : ఏపీలో దారుణం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య..!
తాజాగాధర పెంపుతో ఢిల్లీలో సిఎన్జి ధర ప్రస్తుతం కిలో 83.09 రూపాయలు ఉండగా అది 86.98 రూపాయలకు చేరింది. పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్తతల కారణంగా ఇంటర్నేషనల్ మార్కెట్లో ధరలు భారీగా పెరగడమే అందుకు కారణంగా చెబుతున్నారు. ఇందన ధరల పెంపుపై స్థానిక క్యాబ్ డ్రైవర్లు ప్రైవేటు వాహనదారులు తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వారానికి, 10 రోజులకు ఒకసారి ధరలు పెంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.









