Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
జిల్లా వార్తలుజాతరలుతెలంగాణసంగారెడ్డి జిల్లా

విట్టల్ రుక్మిణి మాతకు అభిషేకం

దాతలకు సన్మానం చేసిన సర్పంచ్

కంగ్టి , మన సాక్షి :

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ విఠలేశ్వర మందిరంలో మాఘ వారిని పురస్కరించుకొని శనివారం విట్టల్ రుక్మిణి మాత అభిషేకం నిర్వహించి పట్టు వస్త్రాలు వెండి కిరీటం వడ్ల దత్తూరాం పంతులు అందించడం జరిగింది. కాపార్థి దత్తు సెట్, వైష్ణవ్ సాంప్రదాయ భక్తులకు భజన టళలు12 జతలు అందించడం జరిగింది.

ప్రతి సంవత్సరము లాగానే శనివారం ధ్వజారోహణం ఆదివారం నాడు ప్రారంభమైన సప్తహ శనివారం గాథా పూజ మహా అన్నదాన కార్యక్రమం ఆదివారం కాలా కీర్తన జరుపబడును అని ఆలయ కమిటీ సిబ్బంది తెలిపారు. అనంతరం దాతలకు శాలువతో సన్మానం చేసిన గ్రామ సర్పంచ్ గడ్డం మనోహర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ హనుమంత్ రెడ్డి తాజా మాజీ సర్పంచ్ పండరినాథ్ రావు సీనియర్ నాయకులు మల్లారెడ్డి విట్టల్ గుండప్ప సత్యనారాయణ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు