అమెరికాలోని టెక్సాస్ లో ఉన్మాది కాల్పులు.. సూర్యాపేట జిల్లా యువతి మృతి

అమెరికాలోని టెక్సాస్ లో ఉన్మాది కాల్పులు.. సూర్యాపేట జిల్లా యువతి మృతి
సూర్యాపేట (నేరేడుచర్ల) మనసాక్షి :
అమెరికాలోని టెక్సాస్ లో శనివారం సాయంత్రం ఉన్మాదులు జరిపిన కాల్పుల్లో సూర్యాపేట జిల్లా నేరేడు చర్ల మున్సిపాలిటీ పరిధిలోని పాత నేరేడుచర్ల చెందిన తాటికొండ ఐశ్వర్య రెడ్డి (27) మృతి దుర్మరణం పాలైంది. టెక్సాస్ లో దుండగుడు మాల్ లో కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఐశ్వర్యతో పాటు తొమ్మిది మంది చనిపోయారు
ఐశ్వర్య తండ్రి తాటికొండ నర్సిరెడ్డి రంగారెడ్డి జిల్లా కోర్టులో జడ్జిగా పనిచేస్తున్నారు. ఐశ్వర్య నేరేడుచర్ల మాజీ ఎంపీపీ , మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తాటకొండ రామ నర్సింహారెడ్డి మనవరాలు .
అమెరికాలోని పర్ఫెక్ట్ జనరల్ లో ప్రాజెక్టు మేనేజర్ గా పనిచేస్తున్న ఐశ్వర్య కాల్పుల్లో మృతి చెందడం పట్ల పాత నేరేడుచర్లలో విషాదఛాయలు నెలకొన్నాయి.