Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా
Breaking : రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ నేత మృతి..!
రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ నేత మృతి చెందారు.

Breaking : రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ నేత మృతి..!
సుర్యాపేట రూరల్ , మనసాక్షి :
రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ నేత మృతి చెందారు. ఖమ్మం పట్టణానికి చెందిన మహమ్మద్ జావిద్ ( 49 ) అతను తన కారు నెంబర్ టీజీ 09, ఏ ఎం, 1245 గల కారును నడుపుకుంటూ ఖమ్మం నుండి హైదరాబాద్ కి తానే స్వయంగా నడుపుకొని వెళుచుండగా ప్రమాదం జరిగింది.
మార్గ మధ్యలో సూర్యాపేట మండల పరిధిలోని పిల్లలమర్రి గ్రామ శివారులో ఎన్ హెచ్ 365 బిబి రోడ్డు పైన బర్రెలు అడ్డం రాగా వాటిని తప్పించే క్రమంలో కారు అదుపుతప్పి ఎడమ సైడ్ ఉన్న డివైడర్ కు తగిలి కారు ఫల్టీలు కొట్టి జావిద్ తలకు బలమైన గాయాలయి అక్కడికక్కడే మృతి చెందాడు.
మృతుడి తమ్ముడు మహమ్మద్ వాజిద్ దరఖాస్తుపై సూర్యాపేట రూరల్ ఎస్సై ఎన్ బాలు నాయక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..









