Breaking Newsఅభివృద్దిజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

సల్కునూరు గ్రామ సమగ్ర అభివృద్ధికి కృషి..!

వేములపల్లి మండలంలోని సల్కునూరు గ్రామంలోని 6,7వ వార్డు ప్రజలు మట్టి రోడ్డు గుంతలు పడి.. రాకపోకలు కొనసాగించడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

సల్కునూరు గ్రామ సమగ్ర అభివృద్ధికి కృషి..!

వేములపల్లి, మన సాక్షి :

వేములపల్లి మండలంలోని సల్కునూరు గ్రామంలోని 6,7వ వార్డు ప్రజలు మట్టి రోడ్డు గుంతలు పడి.. రాకపోకలు కొనసాగించడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఈ విషయాన్ని తెలుసుకున్న గ్రామ సర్పంచ్ నారబోయిన సతీష్ గౌడ్… వెంటనే స్పందించి ట్రాక్టర్ ద్వారా మట్టి పోసి రోడ్డుకు మరమ్మతులు చేయించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గ్రామ సమగ్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానన్నారు.మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి సహకారంతో..గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందు ఉంచుతానన్నారు. గ్రామంలోని నేరాల నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణకై ప్రధాన వీధుల్లో 12 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. వారి వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.

MOST READ 

మరిన్ని వార్తలు