జిల్లా వార్తలుBreaking Newsతెలంగాణనల్గొండవ్యవసాయం
Miryalaguda : పాలమూరు రైతు పండుగ కు తరలి వెళ్ళిన మిర్యాలగూడ రైతులు..!
Miryalaguda : పాలమూరు రైతు పండుగ కు తరలి వెళ్ళిన మిర్యాలగూడ రైతులు..!
మిర్యాలగూడ, మన సాక్షి :
పాలమూరు జిల్లాలో నవంబర్ 30 (శనివారం) నిర్వహించిన రైతు పండగ బహిరంగ సభకు మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి రైతులు భారీగా తరలి వెళ్లారు. రైతులు తరలి వెళ్లే బస్సులకు స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి జండా ఊపి ప్రారంభించారు.
రైతు పండగ మహా సభను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఆయన రైతులను కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వంగా ఉందని, రైతులకు ఎలాంటి కష్టం వచ్చినా ఆదుకుంటుందని పేర్కొన్నారు. దేశ చరిత్రలోనే రుణమాఫీ అంశం చిరస్థాయిగా నిలిచిపోయేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు లక్షల రైతుల రుణమాఫీ చేశారని ఆయన అన్నారు.
MOST READ :









