Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
వేములపల్లి : చేపల వేటకు వెళ్లిన వ్యక్తి మృతి
వేములపల్లి : చేపల వేటకు వెళ్లిన వ్యక్తి మృతి
వేములపల్లి , మన సాక్షి
చెరువులో చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని ఆమనగల్ గ్రామ పంచాయతీ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆమనగల్ గ్రామపంచాయతీ రావు వారి గూడెం గ్రామానికి చెందిన పేర బోయిన నాగరాజు మంగళవారం చెరువులో చేపల వేటకు వెళ్లాడు .
వల కాళ్ళకు గ్జెలు చుట్టుకోవడంతో చెరువులో శివమై తేలాడు. బుధవారం చెరువులో తేలడంతో చెరువు కాపలాదారులు గమనించి పోలీసులకు తెలియజేశారు. పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్ కి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై విజయ్ కుమార్ తెలిపారు.
ALSO READ :










