Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
మిర్యాలగూడ : వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు చోరీ..!
మిర్యాలగూడ : వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు చోరీ..!
మిర్యాలగూడ రూరల్, మనసాక్షి:
వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు చోరీ చేసిన సంఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు టూవీలర్ బైక్ పైన కాకనూరి ముత్యాలమ్మ (72) వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసును లాక్కొని దోపిడీకి పాల్పడ్డారు . ఆమె కుమారుడి ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
డి.ఎస్.పి వెంకటగిరి సంఘటన స్థలాన్ని సందర్శించారు. వృద్ధురాలితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. దోపిడి దొంగలను పట్టుకునేందుకు అన్ని పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించారు.
ALSO READ :









